Home » ఇంగ్లాండ్ లో ఇండియా వికెట్ కీపర్ బ్యాగ్ దొంగతనం..!

ఇంగ్లాండ్ లో ఇండియా వికెట్ కీపర్ బ్యాగ్ దొంగతనం..!

by Azhar

భారత మహిళల జట్టు వికెట్ కీపర్ అయిన తానియా సప్నా భాటియా యొక్క గదిలో దొంగతనం అనేది జరిగింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అయితే తాజాగా భారత మహిళల జట్టు టీ20 మరియు వన్డే సిరీస్ ల కోసం ఇంగ్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో టీ20 సిరీస్ ను 2-1తో ఓడిపోయిన భారత మహిళలు వన్డే సిరీస్ ను 3-0 తో గెలుచుకున్నారు.

అయితే ఈ పర్యటన వెళ్లిన భారత మహిళా జట్టులో తానియా సప్నా భాటియా కూడా ఒక్క ప్లేయర్. ఇక అక్కడ మన ప్లేయర్స్ కు లండన్ లోని మారియట్ హోటల్ లో బస అనేది ఏర్పాటు చేసారు. అయితే ఈ హోటల్ నుండే తానియా సప్నాకు చెందిన ఓ బ్యాగ్ పోయినట్లు ఆమె ప్రకటించింది.

ట్విట్టర్ లో తానియా సప్నా చేసిన పోస్ట్ లో.. నేను ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టులో భాగంగా ఉన్న సమయంలో ఎవరో నా వ్యక్తిగత గదిలోకి వెళ్లి నగదు, కార్డులు, గడియారాలు మరియు ఆభరణాలతో కూడిన నా బ్యాగ్‌ని దొంగిలించారు అని తెలిపింది. అదే విధంగా ఈ విషయంపై విచారం జరిపి పరిష్కారం చూపించాలి కోరింది. ఇంగ్లాండ్ బోర్డుకు ఇష్టమైన ఈ హోటల్ లో ఎటువంటి భధ్రత అనేది లేకపోవడం ఆశ్చర్యం అని ఆమె పేర్కొంది. మరి ఈ విషయంపై బీసీసీఐ అలాగే ఇంగ్లాండ్ బోర్డు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.

ఇవి కూడా చదవండి :

టీమిండియాకు చుక్కలు చూపించిన ఫ్యాన్స్..!

హైదరాబాద్ క్రికెటర్ పై నోరుపారేసుకున్న జైస్వాల్.. గ్రౌండ్ నుండి బయటకే..!

Visitors Are Also Reading