Home » ఏపీ టెన్త్ ఫలితాలలో.. 600కు 599 మార్కులను సాధించిన విద్యార్థిని..!

ఏపీ టెన్త్ ఫలితాలలో.. 600కు 599 మార్కులను సాధించిన విద్యార్థిని..!

by Sravya
Ad

పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం కోసం విద్యార్థులు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. తాజాగా ఏపీ 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. కాగా 616000 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకి హాజరయ్యారు. ఈ ఫలితాల్లో స్టేట్ టాపర్ గా ఆకుల వెంకట నాగ సాయి మనస్వి నిలిచింది. ఈమె ని చూసి ఇప్పుడు అంతా శబాష్ అని ప్రశంసల తో ముంచేస్తున్నారు. ఇక మార్కులు విషయానికి వస్తే.. 600 మార్కులు కి నాగసాయి మనస్వి కి 599 వచ్చాయి. ఈమె మార్కులు చూసి అందరూ ఈమె గ్రేట్ అంటూ ప్రశంసలతో ముంచేస్తున్నారు.

Advertisement

హిందీ తప్ప మిగతా అన్ని సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు సాధించింది. హిందీ లో మాత్రమే ఈమె కి ఒక్క మార్కు పోయింది. మనస్వి ఏలూరు జిల్లాకి చెందిన ఆమె. ఈ విద్యార్థి ని బాల్యం నుండి చదువు లో ముందే ఉండేది. స్టేట్ టాపర్ గా నిలవడంతో ఈమె సంతోషానికి అవధులే లేవు. టెన్త్ పరీక్ష ఫలితాల్లో మనస్వి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ని సాధించింది. ఈమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisement

Also read:

Also read:

ఆమె చదివిన స్కూల్ కి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. తెలుగు ఇంగ్లీషు లో నూటికి నూరు మార్కులు సాధించిన విద్యార్థిని టాలెంట్ ని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. మనస్వికి శుభాకాంక్షలు చెప్తున్నారు. భవిష్యత్తు లో కూడా ఈమె మంచి మార్కులు సాధించి ఇలానే కొనసాగించాలని అంతా కోరుకుంటున్నారు. మనస్వి వంటి విద్యార్థినులు ఈ సమాజానికి ఎంతో అవసరమని నెటిజన్స్ అంటున్నారు. మే నెల 24వ తేదీ నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగబోతున్నాయి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading