Home » టీ20 వరల్డ్‌ కప్‌ లో వీళ్ళే ఓపెన్‌ చెయ్యాలి.. దాదా చెప్పినట్టే చేస్తారా..?

టీ20 వరల్డ్‌ కప్‌ లో వీళ్ళే ఓపెన్‌ చెయ్యాలి.. దాదా చెప్పినట్టే చేస్తారా..?

by Sravya
Ad

క్రికెట్ అభిమానులు ఐపీఎల్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని పొందుతున్నారు. అన్ని టీం లు కూడా సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టేస్తున్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్ కూడా చివరి బాల్ దాకా వెళ్తూ క్రికెట్ అభిమానులకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఒకపక్క ఐపిఎల్ ఇంకో పక్క T20 వరల్డ్ కప్ రానుందని అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ లో బాగా ఆడుతున్న ఆటగాళ్లు ఎవరు..? వీరిలో టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాలో ఉండే వాళ్ళు ఎవరిని ఉంచాలి? ఎవరిని తీసేయాలి అనే లెక్కలు వేసుకుంటున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చీఫ్ సెలెక్టర్ కూడా ఈ విషయంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్ ప్రస్తుత ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ కి డైరెక్టర్ గా ఉన్న సౌరవ్ గంగూలీ ఇండియన్ టీం గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. వాళ్ళిద్దరూ ఓపెనర్లుగా ఆడితే టీమిండియా కి తిరుగుండదని అన్నారు. ఎవరంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీళ్లిద్దరూ T20 వరల్డ్ కప్ లో ఓపెనర్లుగా ఆడాలని దాదా చెప్పారు. కోహ్లీ కేవలం 40 బాల్స్ లో సెంచరీ చేసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Also read:

Also read:

ప్రస్తుతం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నారు. కోహ్లీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. రోహిత్ శర్మ కూడా అత్యధిక రన్స్ స్కోర్ చేసాడు. రోహిత్ లిస్టు లో టాప్ ఫోర్ లో ఉన్నారు. టీమ్ ఇండియాకి రెండు కళ్ళు వంటి రోహిత్ విరాట్లు ఇలాంటి ఫామ్ లో కొనసాగించడం నిజంగా ఇండియన్ క్రికెటర్లకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరి కోహ్లీ ఓపెనర్ గా ఆడడానికి ఇష్టపడతాడా లేదంటే ఆ ప్లేస్ లో ఇంకెవరినైనా పెడతారా అనేది చూడాలి.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading