Home » కొండవీటి సింహం లో చిరంజీవిని నటించకుండా చేసింది ఎవరు..?

కొండవీటి సింహం లో చిరంజీవిని నటించకుండా చేసింది ఎవరు..?

by Sravya
Ad

నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నందమూరి తారక రామారావు తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయం గెలుచుకున్నారు. ముఖ్యంగా పౌరాణిక పాత్రలు చేసి అందర్నీ ఆకట్టుకునేవారు ఎన్టీఆర్. 1981 అక్టోబర్ 7న విడుదలైన కొండవీటి సింహం సినిమాలో ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ గా ఎన్టీఆర్ నటన కి అందరూ ఫిదా అయిపోయారు. అప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమంలో ఉన్న రికార్డ్లు అన్నిటిని కూడా పక్కన పెట్టేసి కొత్త రికార్డుని క్రియేట్ చేశారు. అసలు ఆ రోజుల్లో ప్రతి తెలుగు వాడి నోటి నుండి ఈ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ లు వచ్చేవి అంతటి గొప్ప సినిమా కొండవీటి సింహం.

Advertisement

అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ కి కొడుకుగా కొండవీటి సింహం సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించిన కొండవీటి సింహం లో ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ గా రాము డ్యూయల్ రోల్ చేశారు. రంజిత్ కుమార్ కి ఒక కొడుకు పుట్టగానే ఆ కొడుకు ఉంటే రంజిత్ కుమార్ కి ప్రమాదం అని జ్యోతిష్యుడు చెప్పడంతో రంజిత్ కుమార్ మామయ్య ఆ బిడ్డని దూరం చేస్తాడు.

Also read:

Advertisement

Also read:

తర్వాత కొన్నాళ్ళకి ఇంకో కొడుకు పుట్టి చెడ్డవాడిగా మారిపోతాడు ఈ క్యారెక్టర్ కి చిత్ర దర్శకుడు రాఘవేంద్రరావు మొదటి చిరంజీవిని అనుకున్నారు నిర్మాతలు కూడా ఓకే చెప్పారు. రాఘవేంద్రరావు చిరంజీవి ఎన్టీఆర్ రెండో కొడుకుగా పెట్టాలని అనుకున్నారు కానీ చిరంజీవి డేట్స్ లేకపోవడంతో ఆ క్యారెక్టర్ మోహన్ బాబుకి ఇచ్చారు. ఈ విషయం స్వయంగా రాఘవేంద్రరావు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జయంతి, చిన్న ఎన్టీఆర్ సరసన శ్రీదేవి, మోహన్ బాబు సరసన గీతా నటించారు. రోజా మూవీస్ పథకంపై అర్జున్ రాజు, శివరామరాజులు ఈ సినిమాని నిర్మించారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading