Home » అద్దె గ‌ర్భం ద్వారా పిల్ల‌ల‌ను క‌న్న సెల‌బ్రెటీలు వీళ్లే..!

అద్దె గ‌ర్భం ద్వారా పిల్ల‌ల‌ను క‌న్న సెల‌బ్రెటీలు వీళ్లే..!

by AJAY
Published: Last Updated on
Ad

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా త‌ల్లైంది. అస‌లు ప్రియాంక ప్రెగ్నెంట్ కాలేదు ఎలా త‌ల్లైంద‌ని అంతా ఆశ్య‌ర్య‌పోతున్నారు. నిజానికి ప్రియాంక చోప్రా ఆమె భ‌ర్త నిక్ జోనాస్ లు స‌రోగ‌సి ద్వారా బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు.

priyanka chopra

priyanka chopra

ఈ విష‌యాన్ని ప్రియాంక చోప్రా వెల్ల‌డించింది. ఇక ఇప్ప‌టికే చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ప‌లువురు స‌రోగ‌సి ద్వారా పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. ఆ సెల‌బ్రెటీ త‌ల్లులు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం.

Advertisement

sunny leone
స‌న్నీలియోన్ కూడా స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. అంతే కాకుండా మరో బిడ్డ‌ను స‌న్నీలియోన్ ద‌త్త‌త తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక ప్ర‌స్తుతం స‌న్నీలియోన్ బాలీవుడ్ తో పాటూ టాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది.

also read : Unstoppable with nbk : చిన్నారుల‌ హార్ట్ ఆప‌రేష‌న్ల‌ వెన‌క క‌న్నీళ్లు పెట్టించే క‌థ చెప్పిన మ‌హేశ్ బాబు..!


బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ రెండో భార్య కిర‌ణ్ రావు కూడా అద్దె గ‌ర్భం ద్వారా బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. కిర‌ణ్ రావుకు 36 ఏళ్ల వ‌య‌సులో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌డం వ‌ల్ల అద్దె స‌రోగ‌సి ద్వారా మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

Advertisement

sharukh khan family

sharukh khan family

షారుక్ ఖాన్ గౌరీ ఖాన్ లు కూడా మూడో బిడ్డ‌ను స‌రోగ‌సి ద్వారానే కన్నారు. గౌరీఖాన్ 40 ఏళ్ల వ‌య‌సులో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం క్షేమం కాద‌ని భావించి స‌రోగ‌సి ద్వారా మ‌గ‌బిడ్డ అక్బ‌ర్ ఖార్ కు జ‌న్మనిచ్చింది.

manchu lakshmi family
బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోనూ స‌రోగ‌సి ద్వారా బిడ్డ‌ను క‌ని మంచు ల‌క్ష్మి అంద‌ర్నీ ఆశ్చ‌ప‌ర్చింది. మంచు ల‌క్ష్మి దంప‌తులు త‌మ బిడ్డ విద్యా నిర్వాణకు స‌రోగ‌సి ద్వారా జ‌న్మినిచ్చారు. గుజ‌రాత్ కు చెందిన ఓ మ‌హిళ ద్వారా మంచు ల‌క్ష్మి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్టు తెలుస్తోంది.

karan johar family

బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ పెళ్లి చేసుకోకుండా స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు బిడ్డ‌ల‌కు జ‌న్మనిచ్చాడు. పిల్ల‌ల ఆల‌నా పాల‌నా త‌న త‌ల్లి స‌హాయంతో క‌ర‌న్ జోహార్ చూసుకుంటున్నారు.

also read : క్రికెట‌ర్ల వేత‌నాలు….ఇండియాలో ఎంత‌? పాకిస్తాన్ లో ఎంత‌?

Visitors Are Also Reading