Home » సానియా వీడ్కోలు మ్యాచ్ కు రాని షోయబ్… విడాకులు నిజంగానే తీసుకుంటున్నారా?

సానియా వీడ్కోలు మ్యాచ్ కు రాని షోయబ్… విడాకులు నిజంగానే తీసుకుంటున్నారా?

by Bunty
Ad

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తన సొంత గడ్డ హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ ద్వారా తన సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించింది. ఆదివారం ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన రెండు మిక్స్డ్ డబుల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ లోను సానియా జోడి విజేతగా నిలిచింది. తన సుదీర్ఘ కెరియర్ లో ఎన్నో ఘనతలు సాధించిన దేశంలో టెన్నిస్ కు ఎంతో ప్రచారం తీసుకొచ్చిన సానియా అన్ని వైపులా నుంచి వీడ్కోలు శుభాకాంక్షలు వెల్లువెతత్తుతున్నాయి.

READ ALSO : పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్… అసలు కారణం ఇదే,?

Advertisement

సానియా గౌరవార్ధం ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన ఈవెంట్లో సినీ, క్రీడా, రాజకీయ రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరై సానియాకు ఘనంగా వీడ్కోలు పలికారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, భారత క్రికెట్ మాజీ ఆటగాళ్లు మహమ్మద్ అజారుద్దీన్, యువరాజ్ సింగ్, హీరోలు మహేష్ బాబు, దుల్కర్ సల్మాన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తదితరులు సానియాకు వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో సానియా భర్త షోయబ్ మాలిక్ ఎక్కడ కనిపించలేదు.

Advertisement

READ ALSO : అన్న కొడుకు కోసం బాలయ్య తపన.. కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

Incredible story of Indian tennis player Sania Mirza, from the first steps to the birth of a child

ప్రస్తుతం షోయబ్ పాకిస్తాన్ క్రికెట్ లీగ్ లో మ్యాచ్లు ఆడుతున్నాడు. అవేమీ అంతర్జాతీయ మ్యాచులు కాదు, కాబట్టి షోయబ్ ఇండియాకు రావడానికి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాకపోవచ్చు. ఒకవేళ షోయబ్ రావడానికి కుదరకపోయినా సోషల్ మీడియా ద్వారా అయినా సానియాకు వీడ్కోలు సందేశం పంపవచ్చు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే షోయబ్ దీని గురించి పట్టించుకోలేదు. దీంతో మరోసారి సానియా, షోయబ్ విడాకుల వ్యవహారం తెరమీదకు వచ్చింది.

READ ALSO : Ravanasura : రావణాసుర టీజర్ రిలీజ్… అరివీర భయంకరంగా రవితేజ

Visitors Are Also Reading