Home » వచ్చే ఐపీఎల్ లో ధోని ఆడుతాడా…?

వచ్చే ఐపీఎల్ లో ధోని ఆడుతాడా…?

by Azhar
Ad
మహేంద్ర సింగ్ ధోని… తన కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు 4 సార్లు టైటిల్ అందించాడు. అయితే ధోని 2019 లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత నుండి.. అతను ఐపీఎల్ కు ఎప్పుడు రిటైర్మెంట్ ఇస్తాడు అనే చర్చనే జరుగుతుంది.
అయితే ఐపీఎల్ 2020 సీజన్ నుండి ధోని బ్యాటింగ్ లో పెద్దగా రాణించలేకపోతున్నాడు. కానీ 2021 లో మాత్రం కెప్టెన్ గా రాణించి ఆ జట్టుకు టైటిల్ అందించాడు. దాంతో ఐపీఎల్ 2021 ధోనికి ఆఖరి సీజన్ అనే చర్చ జరిగింది. కానీ అతను మాత్రం వచ్చే ఐపీఎల్ లో కూడా తప్పకుండా ఆడుతాను ప్రకటించాడు. దాంతో ఈ ఐపీఎల్ 2022 ధోని చివరి ఐపీఎల్ సీజన్ అనే వార్త ప్రచారంలో ఉంది.
ఇక తాజాగా ఈ విషయం పైన స్పందించిన ధోని.. నేను గత ఏడాదే చెప్పను మీరు నన్ను మళ్ళీ ఎల్లో జెర్సీలో చూస్తారు అని.. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను.. మీరు వచ్చే ఏడాది కూడా నన్ను ఎల్లో జెర్సీలో చూస్తారు.. కానీ అది ఈ జెర్సీనా.. వేరే జెర్సీనా అనేది మీకు అప్పడే తెలుస్తుంది అని ధోని చెప్పాడు. దీని ప్రకారం.. ధోని ఐపీఎల్ 2023 లో ఆటగాడిగా… ఉంటాడా.. లేక కోచ్ గా ఉంటాడా అనేది అప్పుడే చూడాలి.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading