Home » చెన్నై కెప్టెన్ గా మళ్ళీ ధోనినే…!

చెన్నై కెప్టెన్ గా మళ్ళీ ధోనినే…!

by Azhar
Ad

ఐపీఎల్ 2022 లో మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మహేంద్ర సింగ్ ధోనినే ముందుండి నడిపించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చెన్నై యాజమాన్యం కాసేపటి కింద ప్రకటించింది. దాంతో ధోని అభిమానులు అతి ఆనందానికి గురవుతున్నారు.

Advertisement

అయితే ఈ ఐపీఎల్ ప్రారంభానికి రెండు రోజుల ముందు చెన్నై కెప్టెన్ గా జడేజాను యాజమాన్యం ప్రకటించిన సగంతి తెలిసిందే. దాంతో ఆశ్చర్యపోయారు అభిమానులు. ఇక ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత జడేజా కెప్టెన్ గా అంత రాణించలేకపోయాడు. జట్టుకు విజయాలు అందించలేకపోయాడు. అలాగే కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా తన ఆటను కూడా జడేజా సరిగ్గా ఆడలేదు.

Advertisement

ఇక ఇప్పుడు ఇదే కారణంగా జడేజా కెప్టెన్సీను మళ్ళీ ధోనికి ఇస్తున్నాడు అని చెన్నై యాజమాన్యం పేర్కొంది. రవీంద్ర జడేజా తన ఆటపై మరింత దృష్టి పెట్టడానికి చెన్నైకి నాయకత్వం వహించమని ధోనిని అభ్యర్థించడాని… ధోని కూడా ఆసక్తితో జడేజా తన ఆటపై దృష్టి పెట్టడానికి మళ్ళీ చెన్నైని నడిపించడానికి అంగీకరించాడు అని తన ట్విట్టర్ లో రాసుకొచ్చింది సీఎస్కే.

ఇవి కూడా చదవండి :

హిందువునని పాక్ జట్టులో అవహేళన చేసేవారు..!

కోహ్లీ ప్లాప్ షో పై దాదా కీలక వ్యాఖ్యలు…!

Visitors Are Also Reading