Home » గీతాంజలి హీరోయిన్ జీవితంలో దాగి ఉన్న చీకటి కోణం గురించి మీకు తెలుసా ?

గీతాంజలి హీరోయిన్ జీవితంలో దాగి ఉన్న చీకటి కోణం గురించి మీకు తెలుసా ?

by Anji

భారతదేశంలో గర్వించదగ్గ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు మణిరత్నం. సినీ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలను తెరకెక్కించాడు. నాయకుడు, రోజా, బొంబాయి వంటి చిత్రాలు కేవలం తమిళంలో మాత్రమే కాక తెలుగులోకి డబ్‌ అయి భారీ విజయం సాధించాయి. మణిరత్నం తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం గీతాంజలి. నాగార్జున సినీ కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం గీతాంజలి. సాధారణంగా మన తెలుగు సినిమాల్లో హీరో, హీరోయిన్లు చనిపోతారంటే అంగీకరించం. అయితే గీతాంజలి చిత్రం ఈ అనుమాలన్నింటిని పటాపంచలు చేసింది. 

Also Read :  ‘ఏజెంట్’ విషయంలో అఖిల్ కి చేసిన సమంత?

ఈ చిత్రంలో హీరోహీరోయిన్లు ఇద్దరు త్వరలోనే చనిపోతారు.  ఆ విషయం వారిద్దరికి తెలుసు. ఇక అలాంటి ఇద్దరు యువతి, యువకుడి మధ్య చిగురించిన ప్రేమను ఎంతో అందంగా తెర మీద చూపించి.. ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించి.. సినిమాను సూపర్‌డూపర్‌ హిట్‌గా నిలబెట్టాడు దర్శకుడు మణిరత్నం. ఇలాంటి పాత్రలో నాగార్జునను చూడటానికి అభిమానులు ఒప్పుకున్నారంటే అదంతా మణిరత్నం ప్రతిభ అనే చెప్పాలి. ఈ మూవీ ద్వారా తెలుగు తెరకు ఓ బ్యూటీ పరిచయం అయింది.  తనే గిరిజ.గీతాంజలి సినిమా ద్వారా గిరిజ సినీ కెరీర్ ప్రారంభం అయింది. ఈ చిత్రం తరువాత గిరిజ దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఫస్ట్ సినిమాతోనే ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు  సంపాదించుకుంది. ఇక అప్పటి నుంచి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇంత క్రేజ్‌ సంపాదించుకున్న ఆమె.. సినిమాల మీద ఆసక్తితో ఈ ఫిల్డ్‌లోకి రాలేదట.

Also Read  :  Bichagadu 2 : బిచ్చగాడు 2 ట్రైలర్ వచ్చేసింది…

Manam News

ముఖ్యంగా ఆమెకు భారతీయ సంస్కృతి, కళలు, ఇక్కడి తత్వశాస్త్రం, యోగా వంటి వాటి మీద ఆసక్తి ఉండి వచ్చిందట. ముఖ్యంగా ఎక్కువగా దేవాలయాలు తిరిగేది. గిరిజ స్వస్థలం ఇండియా కూడా కాదు. బ్రిటన్‌. తండ్రి కన్నడ, తల్లి బ్రిటిషర్‌. దీంతో ఆమెకు భారతదేశం, అరబిందో మార్గం మీద ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమె మణిరత్నం-సుహాసినిల పెళ్లికి తనకు తెలిసిన ఫ్రెండ్‌ ద్వారా వెళ్లింది. అక్కడ గిరిజను చూసిన మణిరత్నం గీతాంజలి సినిమాలో యాక్ట్‌ చేయాలని అడిగాడు. ఆమె కూడా సరదాగా ఓ ప్రయత్నం చేద్దాం అని ఓకే చెప్పింది.గీతాంజలి హిట్‌ తర్వాత గిరిజకు ఇండస్ట్రీ నుంచి వరుస అవకాశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మలయాళంలో వందనంలో నటిస్తే అది కూడా సూపర్‌ హిట్‌. దాంతో ఆమెకు బాలీవుడ్‌ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. అమీర్‌ ఖాన్‌ సరసన జో జీతా వోయీ సికిందర్‌ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారు. 

Also Read :  ‘ఆదిపురుష్‌’ న్యూ అప్‌డేట్‌.. రాముడి రాకకై సీతమ్మ ఎదురుచూపు

అయితే ముందుగా అనుకున్నట్టు కాకుండా.. మధ్యలో ఎక్స్‌పోజింగ్‌ సీన్‌లు క్రియేట్‌ చేశారట. దీంతో గిరిజ వాటిల్లో నటించడానికి అంగీకరించలేదు. నిర్మాతలు బెదిరింపులకు సైతం దిగారు. గిరిజ కోర్టును ఆశ్రయించింది. కాంట్రాక్ట్‌కు భిన్నంగా ఎక్స్‌పోజింగ్‌ సీన్లలో నటించమని తన మీద ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించింది. దీంతో కోర్టు సదరు నిర్మాతకు మొట్టికాయలు వేసి.. పరిహారం చెల్లించాలని ఆదేశించింది.తనను కోర్టుకు లాగిన గిరిజ మీద కక్ష పెంచుకున్న నిర్మాత.. ఆమెను సినిమా నుంచి తొలగించారు. ఆమీర్‌ఖాన్‌ కూడా అందుకు మద్దతు తెలిపాడు. దాంతో గిరిజ ప్లేస్‌లోకి ఆయేషా జుల్కా వచ్చింది. ఆ సినిమాలో ఆమె ఒక్క పాటలో మాత్రమే కనిపిస్తుంది. ఈ చేదు అనుభవం తర్వాత ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి బిట్రన్‌ వెళ్లింది. దీని గురించి గతంలో ఆమెను ప్రశ్నిస్తే.. నేనేం బాధపడలేదు.. నేను కావాలని సినిమాల్లోకి రాలేదు కదా.. అవకాశం పోయింది అని ఎందుకు ఏడుస్తాను అని నవ్వేసింది. 

Also Read :  పదిహేనేళ్ల ప్రేమ.. ఆ తరువాత పెళ్లి.. ఒక్క మెసేజ్ వారి కాపురాన్ని కూల్చేసింది..!

Visitors Are Also Reading