Home » ఇంట్లో చేపలను పెంచవచ్చా..? మంచి జరుగుతుందా..?

ఇంట్లో చేపలను పెంచవచ్చా..? మంచి జరుగుతుందా..?

by Sravya
Ad

చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో ఎటువైపు ఏది ఉండాలి అనేది సక్రమంగా చూసుకుని దానికి తగ్గట్టుగా మీరు అనుసరించారంటే, మీకు ఎటువంటి లోటు ఉండదు ఎలాంటి నష్టం కూడా వాటిల్లదు. మానవులకి పెంపుడు జంతువులతో చాలా కాలంగా అనుబంధం ఉంది. పెంపుడు జంతువులు రక్తపోటుని తగ్గిస్తాయి పైగా ఒత్తిడి కూడా తొలగిపోతుంది. పెంపుడు జంతువులు ఇంట్లో ఉండడం వలన ఆనందాన్ని కలిగించే హార్మోన్లు ప్రొడ్యూస్ అవుతాయి. రకరకాల నొప్పులు కూడా తగ్గిపోతూ ఉంటాయి.

Advertisement

Also read:

చాలామంది ఇళ్లలో చేపలని పెంచుతూ ఉంటారు ఇంట్లో చేపలు పెంచుకోవడం చాలా మంచిది. చాలా మంది ఇళ్లల్లో అక్వేరియంలో చేపలు ఉంటాయి. నిజానికి చేపలు పెంచడం వలన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లోకి పోసిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏమైనా సమస్యలు ఉంటే కూడా చేపల వలన తొలగిపోతాయి. చేపల్ని పెంచుకుంటే ఆనందం కూడా బాగా ఎక్కువవుతుంది. ధనం కూడా పెరిగిపోతుంది. ఒత్తిడితో సతమతమయ్యే వాళ్ళు ఇంట్లో చేపల్ని పెట్టుకోవడం మంచిది గోల్డ్ ఫిష్ అయితే మరీ మంచిది.

Advertisement

Also read:

గోల్డ్ ఫిష్ ఇంట్లో పెంచడం వలన అదృష్టం కలుగుతుంది. పైగా చేపలు ఇంట్లో ఉండడం వలన వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. మరి ఇక పెంపుడు జంతువుల్ని పెంచుకునే వాళ్ళు చేపలని కూడా మీ ఇంట్లో పెంచుకోవడం మొదలుపెట్టండి. ఇన్ని ఉపయోగాలు ఉంటాయి. మరింత సంతోషంగా ఉండొచ్చు. అలానే వాస్తు దోషాలతో పాటుగా ఆరోగ్య ప్రయోజనాలను కూడా. ఇలా చేపలు తొట్టె లేదా అక్వేరియం ఇంట్లో ఉండడం వలన కలుగుతాయి. సంతోషంగా జీవించాలన్న ఈ సమస్యలతో బాధపడే బాధపడుతున్న వాళ్ళయినా ఈ ఒక్క టిప్ ని పాటిస్తే సరిపోతుంది ఇక ఆనందమే ఆనందం.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading