Home » ఢిల్లీకి షాక్.. కరోనా కారణంగా పాంటింగ్ జట్టుకు దూరం..!

ఢిల్లీకి షాక్.. కరోనా కారణంగా పాంటింగ్ జట్టుకు దూరం..!

by Azhar
Ad

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో దెబ్బ తగిలింది. కరోనా కారణంగా హెడ్ కోచ్ రికీ పాంటింగ్ జట్టు కు దూరమయ్యాడు. అయితే కరోనా నిబంధనలతో కూడిన బయో బాబుల్ మధ్య జరుగుతున్న ఈ ఐపీఎల్ లో కేవలం ఢిల్లీ జట్టును మాత్రమే కరోనా వెంటాడుతుంది.

Advertisement

మొదట ఆ జట్టులోని ఒక్క సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతోనే ఆ జట్టును క్వారంటైన్ లో పెట్టారు. ఇక ఆతర్వాత పంజాబ్ తో జరిగే మ్యాచ్ కు ముందు మరో 5 కరోనా కేసులు ఢిల్లీ శిబిరంలో వెలుగుచూశాయి. అయిన కూడా ఆ మ్యాచ్ ను నిలపని బీసీసీఐ కేవలం వేదికను మర్చి జరిపింది. అయితే ఇందులో ఢిల్లీనే ఘన విజయం సాధించింది.

Advertisement

అయితే ఈ రోజు ఢిల్లీ జట్టు రాజస్థాన్ రాయల్ తో తలపడే ముందు.. ఆ జట్టు హెడ్ కోచ్ అయిన పాంటింగ్ తో కలిసి తన రూమ్ లో ఉంటున ఓ ఫ్యామిలీ మెంబర్ కు కరోనా పాజిటివ్ గా తెలిసింది. దాంతో పాంటింగ్ కు కూడా రెండు కరోనా పరీక్షలు నిర్వహిచగా.. నెగెటివ్ వచ్చింది. అయిన కూడా తనతో ఉంటున్న మెంబర్ కు కరోనా సోకడంతో నేడు రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ కు పాంటింగ్ అందుబాటులో లేడు. అయితే ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ యాజమాన్యమే ప్రకటించింది.

ఇవి కూడా చదవండి :

రోహిత్ పేరిట చెత్త రికార్డు..!

ధోని ఓ గొప్ప ఫినిషర్ : కేటీఆర్

Visitors Are Also Reading