Home » పదిహేనేళ్ల ప్రేమ.. ఆ తరువాత పెళ్లి.. ఒక్క మెసేజ్ వారి కాపురాన్ని కూల్చేసింది..!

పదిహేనేళ్ల ప్రేమ.. ఆ తరువాత పెళ్లి.. ఒక్క మెసేజ్ వారి కాపురాన్ని కూల్చేసింది..!

by Anji

వారిద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. దాదాపు వారు 15 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను కొనసాగిస్తూనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వారి ప్రేమ విషయం గురించి పెద్దలకు చెప్పి వారిని ఒప్పించి వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత వీరు హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు. హనీమూన్ లో ఈ నూతన దంపతులు చాలా ఎంజాయ్ చేయవచ్చని భావించారు. హనీమూన్ లో భాగంగా ఈ నూతన జంట ఇటీవలే ఓ పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. వారి జీవితంలో మధురానుభూతిని అస్వాదిస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా భర్తకు ఓ సందేశం వచ్చింది. అది చదివిన నవ వధువు ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఆ మెస్సెజ్ తో వారి కాపురం నిలువునా కూలిపోయింది. అసలు సందేశంలో ఏం ఉంది.. ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :  స్త్రీలు తమకు బాగా నచ్చిన మగవారితో మాత్రమే ఇలా ప్రవర్తిస్తారట..!

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి ప్రాంతంలో కౌసల్య అనే యువతి నివాసం ఉంటుంది. వీరిది చాలా పేద కుటుంబం.  ఇదే గ్రామానికి చెందిన సుకేష్ అనే యువకుడు నివాసముంటున్నారు. సుకేష్ సంపన్నుడి కుటుంబం. అయితే వీరిద్దరిదీ ఒకే గ్రామం కావడంతో ఓ సందర్భంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు 15 ఏళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఎంతలా అంటే.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వీరు మారిపోయారు. వీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ మధ్యకాలంలో ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన కొద్ది రోజుల పాటు వీరు సంతోషంగానే ఉన్నారు. అంతలోనే హనీమూన్ వెళ్లాలని ప్లాన్ చేశాడు సుకేష్. 

Also Read :  Krishna Simhasanam: మూవీ కోసం 12 కి.మీ క్యూ లైన్ లు కట్టారని మీకు తెలుసా..?

హనీమూన్ కోసం ఇటీవల ఓ పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. అక్కడ చాలా సంతోషంగా గడుపుతున్న సమయంలోనే సుకేష్ ఫోన్ కు వాట్సాప్ లో ఓ సందేశం వచ్చింది. అది ఏంటంటే..  నేను నీకు అవసరం లేదు కదా? నాకు తిరిగి ప్రేమను ఇవ్వలేకపోయావు అంటూ వచ్చింది. ఈ సందేశాన్ని చదివిన  భార్య కౌసల్య ఒక్కసారిగా షాక్ కు గురైంది. అనుమానం వచ్చిన  కౌసల్య  ఆ నెంబర్ పై ఉన్న వాట్సాప్ మెసేజ్ అన్నింటినీ  చదివింది. భర్త సుకేష్ వరసకు కోడలు అయినటువంటి అస్థికతో ఎఫైర్ నడిపిస్తున్నాడనే విషయం తెలుసుకుంది  కౌసల్య. దీంతో వెంటనే ఆ దంపతులు తిరిగి ఇంటికి వచ్చారు. 

Also Read :  భార్య భర్తను ఇలా చూసుకుంటే భర్త మరో స్త్రీ వైపు వెళ్లడు

వచ్చి రాగానే కౌసల్య ఈ విషయాన్ని అత్తమామలకు వివరించింది. కోడలు మాటలు విన్న సుకేష్ తల్లిదండ్రులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కౌసల్య  తీవ్ర మనస్థాపానికి గురైంది. దాదాపు 15 ఏళ్లుగా పిచ్చిగా ప్రేమించిన కౌసల్యకు నమ్మలేని నిజం బయట పడడంతో బోరున విలపించింది. విటన్నిటినీ తట్టుకోలేకపోయిన ఆ యువతి.. ఇటీవలే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురు మరణవార్త తెలుసుకున్న కౌసల్య తల్లిదండ్రుల రోదనలు చూస్తే కంటతడి పెట్టకుండా ఉండరు.  కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో సుకేష్ వరుసకు కోడలు అయినటువంటి అస్థికతో వివాహేతర సంబంధాన్ని నడిపించినట్టు వెల్లడి అయింది. దీంతో పోలీసులు భర్త సుకేష్, అత్తమామలు, అస్తికను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది.  

Also Read :  చిరంజీవి ఇంద్ర స్టోరీని తొలుత ఆ ద‌ర్శ‌కుడు రిజెక్ట్ చేశాడ‌నే విష‌యం మీకు తెలుసా..?

Visitors Are Also Reading