Home » లేటు వయసులో ఒకటైన జంట..!

లేటు వయసులో ఒకటైన జంట..!

by Sravya
Ad

ప్రేమకు వయసుతో సంబంధం లేదు. నాలుగు పదులు దాటినా ఐదు పదులు దాటిన చాలా మంది ప్రేమ సక్సెస్ అవుతుంది. ఐదు పదులు దాటాక మాంగల్య దారణ చేసుకున్నారు ఈ జంట, జిల్లాలోని తరికెర సమీపంలో అమృత పూర్ లోని అమృతేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా సుధా, మోహన్ కుమార్ పెళ్లి జరిగింది. సుధకు 54 సంవత్సరాలు మోహన్ కుమార్ కి 52 సంవత్సరాలు. ఇద్దరు కూడా ఒకే చోట పని చేస్తున్నారు.

Advertisement

ప్రజాప్రతినిధులకు శిక్షణ నిచ్చే రిసోర్స్ మాస్టర్స్ ట్రైనర్లుగా పనిచేస్తున్నారు. మోహన్ కుమార్ బ్రాహ్మణుడు, ఆమె మరాఠీ. అయిన యువకుడిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టుల పట్ల ఆకర్షితులై సిపిఎం లో చేరారు. సుధా కూడా కమ్యూనిస్టు కార్యకర్తగా సామాజిక ఉద్యమాల్లో పాల్గొనేవారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది అది కాస్తా ప్రేమగా మారింది 2005లో ఇద్దరూ మైసూర్లో పంచాయతీరాజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో రిసోర్స్ పర్సన్స్ గా ఎంపిక అయ్యారు.

Advertisement

Also read:

Also read:

ఇద్దరి అన్యోన్యత చూసి అక్కడ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు వీళ్ళిద్దరినీ భార్యాభర్తలు అనుకునేవారు. అయితే అనేక ప్రేమ కథల్లో ఉన్నట్లే వీళ్ళ ప్రేమని కూడా కుటుంబాలు ఒప్పుకోలేదు. దీంతో పెళ్లి చేసుకోకుండానే ప్రేమను కొనసాగించారు చివరికి ఈ జంట ఇప్పుడు ఒకటైంది. గురువారం అత్యంత నిరాడంబరంగా సుధా మెడ లో మోహన్ కుమార్ తాళి కట్టారు. కలకాలం వీళ్ళిద్దరూ కలిసి ఉండాలని నెట్టెంట అంతా కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

Visitors Are Also Reading