Home » భ‌ర్త‌కు క్ష‌ద్ర‌పూజ‌లు చేయించిన మ‌హిళ‌…కార‌ణం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

భ‌ర్త‌కు క్ష‌ద్ర‌పూజ‌లు చేయించిన మ‌హిళ‌…కార‌ణం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by AJAY
Ad

భార్య‌భర్త‌ల బంధానికి ఎంతో విలువ ఉంటుంది. భ‌ర్త కోసం భార్య త‌న కుటుంబాన్ని సైతం విడిచిపెట్టి వ‌స్తుంది కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. అంతే కాకుండా భ‌ర్త‌కు సేవ‌లు చేసుకుంటూ త‌న కుటుంబం కోసం క‌ష్ట‌ప‌డుతుంది. అంతే కాకుండా భ‌ర్త అనారోగ్యం భారిన ప‌డితే కుదుట‌ప‌డాల‌ని పూజ‌లు వ్ర‌తాలు చేస్తుంటుంది. కానీ ఇక్క‌డ ఓ భార్య చేసిన ప‌ని తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. క‌ట్టుకున్న‌వాడికే భార్య క్షుద్ర‌పూజ‌లు చేయించింది.

Advertisement

ఈ ఘ‌ట‌న మైసూర్ లోని నాచ‌న‌ప‌ళ్లిహాళ్య లో చోటు చేసుకుంది. అదే ప్రాంతానికి చెందిన ర‌ఫి స‌మ్రిన్ దంప‌తుల‌కు వివాహం కాగా ఇద్ద‌రూ క‌లిసి ఉంటున్నారు. అయితే కొంత‌కాలంగా ర‌ఫి త‌న భార్య‌తో మాట్లాడటం త‌గ్గించాడ‌ట‌. ఈ నేప‌థ్యంలోనే స‌మ్రిన్ భ‌ర్త పై కోపం పెంచుకుంది. అంతే కాకుండా భ‌ర్త‌ను దారిలోకి తెచ్చుకోవాల‌ని నిర్న‌యించుకుంది. ఈ క్ర‌మంలో స‌మ్రిన్ కు ఓ బాబాతో ప‌రిచ‌య ఏర్పడింది. ఇక ఆ బాబా చెప్పిన‌ట్టు చేయ‌డం మొద‌లుపెట్టింది.

Advertisement

స‌ద‌రు బాబా ప్ర‌తి అమావాస్య రోజున గుమ్మం ముందు నిమ్మ‌కాయ‌లు వేయాల‌ని స‌మ్రిన్ కు సూచించాడు. ఇక స‌మ్రిన్ బాబా చెప్పిన‌ట్టుగానే ప్ర‌తి అమావాస్య రోజున గుమ్మం ముందు నిమ్మ‌కాయ‌లు ప‌లుపు వేయ‌డం మొద‌లుపెట్టింది. అలా వేస్తున్న క్ర‌మంలో భ‌ర్త‌తో పాటు స్థానికుల‌కు కూడా భ‌యం వేసింది. అలా చేస్తున్న వ్య‌క్తి ఎవ‌రో రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకోవాల‌ని అనుకున్నారు. ఇక అమావాస్య రోజున కాపు కాయ‌గా స‌మ్రిన్ దొరికిపోయింది. దాంతో స్థానిక పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు.

also read :చిరంజీవి సినిమాలో నటించమని అడిగితే శ్రియ ఏమందో తెలుసా ?

Visitors Are Also Reading