Home » జబర్దస్త్ కి స్టార్ కమెడియన్స్ ఎందుకు దూరం అవుతున్నారో..అసలు నిజం బయటపడింది..?

జబర్దస్త్ కి స్టార్ కమెడియన్స్ ఎందుకు దూరం అవుతున్నారో..అసలు నిజం బయటపడింది..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు జబర్దస్త్ అంటేనే నవ్వులు పూయించే పెద్ద బిగ్ షో. ఈ షో ద్వారా సుడిగాలి సుదీర్, హైపర్ ఆది ఎంతో పేరు సంపాదించడమే కాకుండా, జబర్దస్త్ షో ను ఆకాశానికెత్తారు. అలాంటి స్టార్ కమెడియన్ లు ఆ షోకు దూరమయ్యారు. దీంతో అభిమానులకు లేనిపోని డౌట్లు వస్తున్నాయి. అసలు వీళ్ళు ఎందుకు దూరమయ్యారు. అసలు ఏం జరుగుతోంది. అప్పట్లో ఈ షో స్టార్ట్ అయినప్పుడు దీనిపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ ఈ షో కామెడీ చాలా హిట్టవడంతో ఇక కమెడియన్స్ కి చాలా పేరు వచ్చింది.

ఆల్మోస్ట్ స్టార్ కమెడియన్ గా మారారు. అలా వారు సినిమాల్లో కూడా ఛాన్సులు కొట్టారు. అలా జబర్దస్త్ లో ఫస్ట్ జనరేషన్ టీమ్ లీడర్స్ వెళ్లిపోయిన తర్వాత హైపర్ ఆది, సుడిగాలి సుదీర్ కొత్త కమెడియన్ టీమ్ లీడర్స్ గా ఎంటరయ్యారు. ఆల్మోస్ట్ వీరు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఈ షోను ఏలారు. చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వీరు షో నుంచి మెల్లిమెల్లిగా బయటకు వెళ్లి పోతుండడం ఫాన్స్ ఆవేదన చెందుతున్నారు. జబర్దస్త్ స్టార్టింగ్ నుంచి జడ్జిగా కంటిన్యూ అయిన నాగబాబు 2019లో షో నుంచి పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల తప్పుకున్నారు. ఏపీ క్యాబినెట్ లో మంత్రి పదవి రావడంతో మరో జడ్జి రోజా రీసెంట్ గా తప్పుకున్నారు.

Advertisement

Advertisement

ప్రస్తుతం ఈ షో చూస్తే ఉన్న టీమ్స్ అన్ని కొత్తవే. అప్పటి టీమ్స్ లా వీరు కామెడీని జనరేట్ చేయలేకపోతున్నారు. ముక్కు అవినాష్, అదిరే అభి,చమ్మక్ చంద్ర, అప్పారావు లాంటి కమెడియన్స్ షోకు చాలాకాలం బ్యాక్ బోన్ గా నిలిచారు. తర్వాత వీళ్ళు కూడా కొద్ది రోజులకు జబర్దస్త్ వీడారు. దీంతో హైపర్ ఆది, సుడిగాలి సుదీర్ వారి భుజాలపై మోసుకొచ్చారు. అలాంటి వారు ప్రస్తుతం కనిపించకపోవడంతో చాలా డౌట్ వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వారికి సినిమాల్లో ఆఫర్లు రావడమే. హైపర్ ఆది మంచి కామెడీ రోల్స్ చేస్తూ ఉండగా, సుధీర్ మాత్రం సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. దీంతో సమయం కుదరక ఈ షో కి దూరం అయ్యారు.

ALSO READ;

బిగ్ బాస్ విన్న‌ర్‌కి బాల‌య్య సినిమాలో బంప‌ర్ ఆఫ‌ర్..!

అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ నే ఎందుకు ల‌వ్ చేస్తారు..? 5 కార‌ణాలు ఇవేనా..!

 

Visitors Are Also Reading