Home » రమ్యకృష్ణ గురించి దర్శకుడు కృష్ణవంశీ చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యపోక ఉండరు..!

రమ్యకృష్ణ గురించి దర్శకుడు కృష్ణవంశీ చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యపోక ఉండరు..!

by Anji
Ad

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎలాంటి పాత్ర అయినా సరే ఆమె అలవొకగా చేయగలిగే టాలెంట్ రమ్యకృష్ణకు మాత్రమే సొంతం అనే చెప్పాలి. ఎలాంటి పాత్రకైనా ఆమెనే కరెక్టుగా సూట్ అవుతుంది. అందుకే ఇప్పటికి కూడా సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు రమ్యకృష్ణ.  ఆమె భర్త కృష్ణవంశీ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో ప్రముఖ దర్శకులుగా కొనసాగుతున్న కృష్ణవంశీ తాజాగా రంగ మార్తాండ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలకపాత్ర పోషించారు.

Also Read :  పవన్ కళ్యాణ్ బాలు సినిమాను కాపీ కొట్టి హిట్ కొట్టిన హీరో ఎవరో తెలుసా ?

Advertisement

ఈ నేపథ్యంలోనే కృష్ణవంశీ రమ్యకృష్ణ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 22న ఉగాది పండగ సందర్భంగా థియేటర్లలో విడుదల అయింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాని రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ వంటి తారాగణం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా కృష్ణవంశీ మీడియాతో మాట్లాడారు. రంగమార్తాండ సినిమా కథ ఆడియన్స్ ని కట్టి పడేస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే  రమ్యకృష్ణ గురించి మాట్లాడారు కృష్ణవంశీ.

Advertisement

Also Read :   రెండో పెళ్లికి రెడీ అయిపోయిన నిహారిక…?

ఈ చిత్రంలో రమ్యకృష్ణ చేసిన పాత్రకు తొలుతా వేరే వాళ్ళను తీసుకోవాలని అనుకున్నాను. కానీ ఆమె కూడా కొన్ని పేర్లను చెప్పారు. అయితే ఆ పాత్ర నువ్వే ఎందుకు చేయకూడదని రమ్యకృష్ణ  అడిగాను. ఆ పాత్ర కోసం తన మేకప్ హెయిర్ స్టైల్ తానే సెట్ చేసుకుంది రమ్యకృష్ణ. ఎప్పుడు పవర్ పుల్ డైలాగ్స్ చెప్పే రమ్యకృష్ణ ఈ సినిమాలో కళ్ళతోనే తన హావ భావాలను తెలుపుతుంది. ప్రధానంగా క్లైమాక్స్ లో రమ్యకృష్ణ నాటన చూస్తే మాత్రం కన్నీళ్లు ఆగవు. అంతలా తన నటనతో మెప్పించింది రమ్యకృష్ణ. ఆమె కళ్ళు అంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చారు కృష్ణవంశీ.

Also Read :   కత్తిలాంటి వాడు, నిత్య పెళ్లి కొడుకు… నరేష్ పై రాజేంద్రప్రసాద్ సంచలనం!

Visitors Are Also Reading