Home » కోహ్లీ నాతో 20 నిముషాలు మాట్లాడు..!

కోహ్లీ నాతో 20 నిముషాలు మాట్లాడు..!

by Azhar
Ad

భారత జట్టులో కీలక ఆటగాడు.. అతను లేకుండా టీం ఇండియా ఒక్క మ్యాచ్ ఆడితే అది గెలుస్తుందా.. లేదా అనే అనుమానం.. ఇవ్వని ఒకప్పుడు విరాట్ కోహ్లీ విషయంలో భారత అభిమనులకు కలిగే అనుమానాలు. ప్రతి మ్యాచ్ లో కోహ్లీ ఉంటె టీం ఇండియా గెలిచినట్లే అని అనుకునేవారు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. అప్పుడు కోహ్లీ లేకుండా భారత జట్టును ఉహించుకొని ఫ్యాన్స్.. ఇప్పుడు కోహ్లీ లేకుంటేనే బాగుంటుంది అనే స్టేజ్ కు వచ్చేసారు. గత మూడేళ్ళుగా విఫలమవుతూ వస్తున్న విరాట్.. తాజాగా టీం ఇండియా వెళ్లిన ఇంగ్లాండ్ పర్యటనలో పూర్తిగా గాడి తప్పాడు.

Advertisement

అయితే ఈ ఇంగ్లాండ్ పర్యటనలో మొత్తం ఆరు ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసిన విరాట్.. ఒక్కే రకమైన విధంగా ఔట్ కావడం.. ఈ విమర్శలను మరింత పెంచేసింది. ప్రతి మ్యాచ్ లో ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ కు ఆవలగా వెళ్తున్న బంతులను ఆడుదాం అని అనుకోని.. మధ్యలో తన నిర్ణయాన్ని వెన్నకి తీసుకుంటూ.. కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అవుతున్నాడు. ఎన్నిసార్లు ఔట్ అయిన కోహ్లీ యొక్క ఈ తీరు అనేది మారలేదు. ఇక ఇప్పుడు ఇదే విషయంఫై భారత మాజీ సీనియర్ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. నువ్వు నాతో ఒక్క 20 నిముషాలు మాట్లాడు కోహ్లీ అంటూ కామెంట్స్ చేస్తున్నాడు.

Advertisement

తాజాగా ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ మాట్లాడుతూ… కోహ్లీ ఇప్పుడు ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులకు తెగ ఇబ్బంది పడటం మన చూస్తున్నం. అయితే ఒక్కే ఓపెనర్ గా నేను ఇలాంటి బంతులను ఎదుర్కోవడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. అయితే మేము ఈ బంతులను ఎదుర్కోవడానికి కొన్ని ప్రయత్నాలు చేసి సఫలం సాధించాం. కాబట్టి ఈవిషయంలో విరాట్ నాతో ఒక్క 20 నిముషాలు మాట్లాడితే.. అతనికి చాలా హెల్ప్ అనేది అవుతుంది. నా సలహాలతో కోహ్లీ ఇప్పుడే మళ్ళీ సెంచరీలు చేస్తాడు అని నేను చెప్పను. కానీ భవిష్యత్తులో మాత్రం మనం వీటి ఫలితాలను చూడవచ్చు.

ఇవి కూడా చదవండి :

దినేష్ కార్తీక్: భార్య, ప్రాణస్నేహితుడు కలిసి మోసం చేస్తే.. అవమానం తట్టుకొని పడిలేచిన…

దక్షిణాఫ్రికా లీగ్ లో కూడా మన ఐపీఎల్ జట్లే హావ…!

Visitors Are Also Reading