Home » పాకిస్థాన్ కు గట్టి దెబ్బ.. ఇండియాకు కలిసొస్తుందా..?

పాకిస్థాన్ కు గట్టి దెబ్బ.. ఇండియాకు కలిసొస్తుందా..?

by Azhar
Ad

ఈ నెల 28న ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ అనేది జరగబోతున్న విషయం తెలిసిందే. ఆసియా కప్ లో భాగంగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు ఇప్పటికే జట్టును ప్రకటించి సిద్ధం అవుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ కు ఇండియా స్టార్ బౌలర్ బుమ్రా మిస్ అవుతున్నాడు అనేది తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటనలో గయా పడిన బుమ్రాను ఈ టోర్నీకి బీసీసీఐ ఎంపిక చేయలేదు.

Advertisement

ఇక మన స్టార్ బౌలర్ లేకపోవడంతో సులువుగా ఇండియాను ఓడించవచ్చు అని పాకిస్థాన్ కలలుకంది. అలాగే బుమ్రా జట్టులో లేకపోవడంతో ఆ జట్టు ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు అనేది నిజం. కానీ వారి ఆనందం కాస్త ఇప్పుడు బాధగా మారిపోయింది. ఎందుకంటే.. పాకిస్థాన్ స్టార్ బౌలర్ అయిన షాహిన్ షా అఫ్రిది జట్టుకు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ బోర్డు ఈరోజు అధికారికంగా ప్రకటించింది.

Advertisement

అయితే పాకిస్థాన్ జట్టు పేరు చెప్పగానే అందరికి బాబర్, రిజ్వాన్ తో పాటుగా అఫ్రిది మాత్రమే గుర్తుకు వస్తాడు. గత ఏడాది ఇండియాను ఓడించడంలో అఫ్రిది కీలక పాత్ర పోషించాడు. కానీ ఇప్పుడు అతనే గాయం కారణంగా మొత్తం ఆసియా కప్ కు దూరమయ్యాడు. అయితే తీరిక లేని క్రికెట్ అనేది ఆడిన కారణంగానే అఫ్రిది గాయం బారిన పడినట్లు తెలుస్తుంది. దాంతో అతనికి ఒక్క నెల విశ్రతి కావాల్సి రావడం తో ఈ టోర్నీ నుండి బయటకు వచ్చేసాడు.

ఇవి కూడా చదవండి :

పరీక్షలో అంపైర్లను బీసీసీఐ అడిగిన కఠిన ప్రశ్నలు ఇవే..?

ఇండియా నాకు చాలా ఇచ్చింది.. అందుకే తిరిగి ఇస్తున్న..!

Visitors Are Also Reading