సీనియర్ నటుడు శరత్ బాబు గురించి అందరికీ సుపరిచితుడే. చాలా చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు చేసి.. ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాలను సంపాదించుకున్నాడు శరత్ బాబు. తాజాగా ఇవాళ అనారోగ్య కారణంగా బెంగళూరులోని ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. దాదాపు 71 ఏళ్ల శరత్ బాబు గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటనే కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి హైదరాబాద్లో ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసినట్టు సమాచారం. 1973 వ సంవత్సరంలో సినిమా రంగంలో నటుడిగా కెరీర్ ని ప్రారంభించిన శరత్ బాబు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేయడం జరిగింది. సపోర్టింగ్ యాక్టర్ గా 8 సార్లు నంది అవార్డులను అందుకున్నారు.
Advertisement
Also Read : బాహుబలిలో అనుష్కకు డూప్ గా నటించింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
ఈయన సినిమా ఫీల్డ్ లోకి రాకముందు పోలీస్ ఆఫీసర్ కావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారట. అయితే ఆయనకి కంటి సమస్య ఉండటంతో ఆ కోరిక మాత్రం నెరవేరలేదు. ఈ తరుణంలోనే తండ్రి వ్యాపారాన్ని చూసుకోమని చెప్పినప్పటికీ.. నటనరంగంపై ఆసక్తి కనబరిచి తల్లి సపోర్ట్ తో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి విజయవంతంగా రాణించారు శరత్ బాబు. సినిమాలతో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా వర్క్ చేయడం చేశారు. అదేవిధంగా బుల్లితెర నటుడిగా కూడా రాణించారు.