టాలీవుడ్ అగ్రహీరోయిన్లలో సమంత రుత్ ప్రభు చాలా నిరాశ చెందింది. ముఖ్యంగా సమంత వ్యక్తిగత జీవితం గురించి కాదండోయ్.. ఇటీవల సమంత నటించిన శాకుంతం చిత్ర ఫలితం గురించి.. ఆమె ఎంతో గొప్పగా చెప్పిన శాకుంతలం సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ చిత్రంపై సమంత ఎన్నో ఆశలను పెట్టుకుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తన కెరీర్ లో బెస్ట్ అని చెప్పింది. కొన్ని పాత్రలు అలా వస్తాయి. కొన్ని మాత్రం జీవితాంతం గుర్తుండి పోతాయి అనేటట్టుగా శాకుంతలం ఉంటుందని విడుదలకు ముందు చెప్పుకొచ్చింది.
Also Read : టాలీవుడ్లో విషాదం.. కమెడియన్ కన్నుమూత
Advertisement
సమంత శకుంతల పాత్రలో, మలయాళం నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించారు. ఈ చిత్రం ఏపిల్ 14న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ వినిపించింది. రెండో షోకి సినిమాకి రావడం మానేశారు. ఎంత ఘోరంగా విఫలమైందంటే.. ఫస్ట్ రోజు షాకింగ్ కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రం ప్రముక నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. దిల్ రాజు కూడా శాకుంతలం చిత్రం విజయం సాధిస్తుందని నమ్మి ముందుస్తుగానే ప్రీమియర్ షోలను వేయించాడు. ఈ సినిమా చూసిన వారందరూ ఈ సినిమా నచ్చలేదని చెప్పారు. ఇలా అట్టర్ ఫ్లాప్ గా మారిన ఈ సినిమా గురించి సమంత ఆసక్తికర కామెట్స్ చేసింది. “కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మాణి” ఇది భగవద్గీత లోని శ్లోకం.
Advertisement
శ్రీకృష్ణుడు, అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధం జరుగుతుండగా.. ఉపదేశించిన గీతాసారం. అందులొచ్చి ఒక శ్లోకం తీసి సమంత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీని అర్థం ఏంటంటే.. నీకు పని చేయడం మీదే అధికారముంది. దాని ఫలితం మీద మాత్రం లేదు. ఫలితానికి నువ్వు కారణం కాకూడదు. అదేవిధంగా పని చేయడం మానకూడదు. ప్రతిఫలం ఆశించకుండా పనులు చేయి అని చెప్పాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇంత వేదాంతం వచ్చేసింది. సమంతకి ఇంత చిన్న వయస్సులో అని అందరూ అనుకుంటున్నారు. శాకుంతలం పోయింది. ఇప్పుడు ఖుషి సినిమా చేస్తోంది. సిటాడెల్ కూడా చేతిలో ఉంది. కొత్తవి ఏవీ ఇంకా ఒప్పుకోలేదు. శాకుంతలం చిత్రం వెబ్ సిరీస్ ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
Also Read : “గీతాంజలి” సినిమా హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!