Home » టాలీవుడ్‌లో విషాదం.. కమెడియన్ కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం.. కమెడియన్ కన్నుమూత

by Bunty
Ad

టాలీవుడ్ లో వ‌రుస విషాదాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఇటీవ‌లి కాలంలోనే ప‌లువురు ఇండ‌స్ట్రీకి చెందినవాళ్లు క‌న్ను మూసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవలే హీరో విక్ట‌రీ వెంక‌టేష్ ఇంట తీవ్ర‌ విషాదం చోటు చేసుకుంది. వెంక‌టేష్ బాబాయి ద‌గ్గుబాటి మోహ‌న్ బాబు క‌న్నుమూశారు. అయితే ఈ సంఘటన మరువకముందే.. మరో తీవ్ర‌ విషాదం చోటు చేసుకుంది.

READ ALSO : Ileana :పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా….

Advertisement

తాజాగా ప్రముఖ కమెడియన్ అల్లు రమేష్ తుది శ్వాస విడిచారు. వైజాగ్ లో ఉంటున్న ఆయన గుండెపోటుతో మరణించినట్టు సమాచారం. దీంతో ప్రముఖ డైరెక్టర్ ఆనంద్ రవి తన ఫేస్బుక్ పోస్ట్ తో సంతాపం తెలిపాడు. “మొదటి రోజు నుండి మీరు నాకు అతిపెద్ద మద్దతుగా ఉన్నారు. ఇప్పటికీ నా మైండ్ లో నీ మాటలు వినిపిస్తున్నాయి.

Advertisement

READ ALSO : ప్రత్యేకంగా అలాంటి దుస్తులు వేసుకోను… బేబీ బంప్ పై ఉపాసన !

టాలీవుడ్‌లో విషాదం.. కమెడియన్ కన్నుమూత | Manalokam

రమేష్ గారు, మీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. మీరు నాలాంటి చాలామంది హృదయాలను హత్తుకున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నాను. ఓం శాంతి” అంటూ రాసుకోచ్చారు. అల్లు రమేష్ మొదట నాటకాలలో నటించారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, ప్రస్తుతం యూట్యూబ్ లో ప్రసారమవుతున్న ‘మా విడాకులు’ వెబ్ సిరీస్ లో మామగా నటించారు.

read also : “విక్రమార్కుడు” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!

Visitors Are Also Reading