Home » Rishabh Pant : ఢిల్లీ డగౌట్ లో రిషబ్ పంత్! ఎమోషనలైన ఫ్యాన్స్…

Rishabh Pant : ఢిల్లీ డగౌట్ లో రిషబ్ పంత్! ఎమోషనలైన ఫ్యాన్స్…

by Bunty
Ad

ఐపీఎల్ 16వ సీజన్ కు రిషబ్ పంత్ దూరమైన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ లో జరిగిన యాక్సిడెంట్ లో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. సర్జరీల అనంతరం పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. వార్నర్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం సీజన్ లో లక్నో సూపర్ జేయింట్స్ తో తొలి మ్యాచ్ ఆడింది.

READ ALSO : టాలీవుడ్ మరో విషాదం..సీనియ‌ర్ న‌టుడు ‘కాస్ట్యూమ్ కృష్ణ’ క‌న్నుమూత‌

Advertisement

ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ ను గుర్తుచేసుకుంటూ అతని జెర్సీని డగౌట్ లో ప్రదర్శన చేసింది. ఈ సమయంలో నువ్వు ఇక్కడ లేకున్నా, నీ జ్ఞాపకాలు మాత్రం మాతోనే ఉంటాయి. మిస్ యు పంత్… ఎల్లప్పుడూ మా డగౌట్ లో.. ఎప్పుడూ మా టీమ్ లోనే అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ క్యాప్షన్ జత చేసింది. అయితే పంత్ జెర్సీని డగౌట్ లో చూసిన కొంతమంది అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. మిస్ యు బ్రదర్ అంటూ కొంతమంది, ఇంపాక్ట్ ప్లేయర్ గా పంత్ వచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

READ ALSO : జనసేన కోసం రానున్న ‘ఆహా’ దిన పత్రిక… ఈ పత్రిక ధర ఎంతో తెలుసా!

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. తమ కెప్టెన్ లేకుండా ఈ సీజన్ లో ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాఫ్ ఓనర్లు, ఆటగాళ్లు, అభిమానులు సీజన్ ప్రారంభానికి ముందే రిషబ్ పంత్ ను కోల్పోయామంటూ బాధపడ్డారు. స్టేడియంకు రప్పించేందుకు ప్రయత్నిస్తామని, తద్వారా అభిమానులు జట్టులో నైతిక స్థైర్యాన్ని పెంచుతామని ఢిల్లీ అధికారులు తెలిపారు. అనుకున్న ప్రకారమే తొలి మ్యాచ్ కు పంత్ జెర్సీని డగౌట్ లో ప్రదర్శన చేసింది.

READ ALSO :  1964 లో “అంబాసిడర్” కారు ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!

Visitors Are Also Reading