Home » గురువుకి వైన్ దక్షిణ ఇచ్చిన పంత్..!

గురువుకి వైన్ దక్షిణ ఇచ్చిన పంత్..!

by Azhar
Ad

ఇంగ్లాండ్ పర్యటనను భారత జట్టు విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది మిగిలిపోయిన ఒక్కే ఆఖరి టెస్ట్ తో పాటుగా… టీ20, వన్డే సిరీస్ ఆడటానికి ఇంగ్లాండ్ వెళ్ళింది భారత జట్టు. అయితే మొదట ఆడిన టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన సిరీస్ ను డ్రా చేసుకున్న భారత జట్టు తర్వాత ఆడిన రెండు వైట్ బాల్ సిరీస్ లను 2-1 తోనే సొంతం చేసుకుంది. ఇక నిన్న జరిగిన చివరి వన్డేలో విజయం సాధించి.. సిరీస్ ను అందుకోవడానికి వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారణం అనేది తెలిసిందే.

Advertisement

నిన్న పంత్ గనక నిలబడి సెంచరీ చేయకపోతే భారత జట్టు 90 శాతం ఓడిపోయేది. కానీ పంత్ తో పాటుగా పాండ్య కూడా అద్భుతంగా ఆడటంతో టీం ఇండియా విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం పాండ్యకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కగా.. పంత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. అయితే ఈ అవార్డుతో చెక్ తో పాటుగా ఆటగాళ్లకు వైన్ బాటిల్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు. అయితే ఈ సెర్మనీ అనంతరం… పంత్ తనకు వచ్చిన వైన్ బాటిల్ ను తీసుకెళ్లి.. టీం ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్రికి ఇచ్చాడు.

Advertisement

అయితే రవిశాస్రి ఈ ఇంగ్లాండ్ పర్యటనలో కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం గ్రౌండ్ లోకి వచ్చిన రవిశాస్రిను చూసి.. పంత్ తనవద్దకు వెళ్లి వైన్ బాటిల్ అనేది ఇచ్చాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. అందులో గురువుకి వై దక్షిణ ఇచ్చాడు పంత్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే రవిశాస్రి టీం ఇండియా హెడ్ కోచ్ గా ఉన్న సమయంలో.. పంత్ ఎన్నిసార్లు విఫలమైన.. అతనికి అవకాశాలు ఇచ్చి అతడిని ఎంకరేజ్ చేసాడు రవిశాస్రి.

ఇవి కూడా చదవండి :

వన్డేలకు స్టోక్స్ గుడ్‌ బై..!

పంత్ విషయంలో మళ్ళీ వక్ర బుద్ధి చూపించిన ఇంగ్లాండ్ బోర్డు..!

Visitors Are Also Reading