Home » బీసీసీఐకి సాయి బాబా బుద్ధి చెబుతాడా..?

బీసీసీఐకి సాయి బాబా బుద్ధి చెబుతాడా..?

by Azhar
Ad

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరు సంపాదించుకున్న బీసీసీఐ పై నిరంతరం ఏవో విమర్శలు వస్తూనే ఉంటాయి. ఎక్కువగా అభిమానుల నుండి మాజీ ఆటగాళ్ల నుండి బీసీసీఐ విమర్శలు వస్తుంటాయి. కానీ తాజాగా ఆటగాళ్ల నుండి కూడా వస్తున్నాయి. భారత జట్టు యువ ఓపెనర్ అయిన పృథ్వీ షా బీసీసీఐ పైన పరోక్షంగా సెటైర్లు అనేవి వేసాడు.

Advertisement

అయితే పృథ్వీ షా పై మొదట్లోనే విపరీతమైన హైప్ అనేది వచ్చింది. ఇక అందుకు తగ్గినట్లుగానే భారత జట్టులో చోటు అనేది అందుకున్న పృథ్వీ షా.. తర్వాత విఫలమ్ అయ్యాడు. అలాగే ఫిట్నెస్ పైన కూడా ఫోకస్ అనేది పెట్టలేదు. దాని కారణంగా వేట్ అనేది పెరిగిన పృథ్వీ షాకు భారత జట్టులో చోటు అనేది రావడం లేదు. ఇక తాజాగా బీసీసీఐ న్యూజిలాండ్, అలాగే బంగ్లాదేశ్ తో ప్రపంచ కప్ తర్వాత ఆడబోయే సిటీస్ లకు జట్లను ఎంపిక చేసింది.

Advertisement

కానీ అందులో పృథ్వీ షా చోటు అనేది లేదు. దాంతో సోషల్ మీడియాలో ఓ సాయి బాబా ఫోటో అనేది షేర్ చేసిన పృథ్వీ షా.. నువ్వు అన్ని చూస్తున్నావ్ అనే నేను అనుకుంటున్నాను సాయి బాబా అంటూ రాసుకొచ్చాడు. ఇక ఇక్కడ బీసీసీఐ పేరు అనేది తీయకపోయిన బీసీసీఐ జట్టును ప్రకటించిన ప్రతిసారి పృథ్వీ షా ఇలాంటి కామెంట్స్ అనేవి చేస్తుండటంతో అది బీసీసీఐనే అన్నాడు అని ఫ్యాన్స్ కు అర్ధం అవుతుంది.

ఇవి కూడా చదవండి :

క్రికెట్ ఫ్యాన్స్ ను ఖుషి చేసిన ఇండిగో..!

సూర్య వీక్ నెస్ పై ప్లాన్ జరుగుతున్నాయా..?

Visitors Are Also Reading