Home » పాకిస్థాన్ లో అందరూ విన్నర్లే.. నువ్వు తప్పా..!

పాకిస్థాన్ లో అందరూ విన్నర్లే.. నువ్వు తప్పా..!

by Azhar
Ad

క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ జట్టు కూడా ప్రముఖ జట్లలోనే వస్తుంది. అయితే గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ లో సెమీస్ వరకు వెళ్లిన పాకిస్థాన్.. ఈ ఏడాది ప్రపంచ కప్ లో మొదటి మ్యాచ్ లో ఇండియా పైన ఓడిపోయింది. ఆ తర్వాత జింబాబ్వే జట్టు పైన కూడా ఓడిపోవడంతో.. పాకిస్థాన్ అభిమానులే ఆ జట్టును ఎన్ని రకాలుగా ట్రోల్ చేయాలో అన్ని రకాలుగా చేసారు.

Advertisement

ముఖ్యంగా పాకిస్థాన్ కెప్టెన్ బాబా ఆజాం వల్లే జట్టు ఓడిపోతుంది అని ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. అయితే మొదటి రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన పాకిస్థాన్ తర్వాత నెదర్లాండ్స్ అలాగే ఈరోజు సౌత్ ఆఫ్రికా పై విజయం సాధించి.. తమ సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగా ఉంచుకుంది. అయిన పాక్ ఫ్యాన్స్ బాబర్ ను ట్రోల్ చేయడం ఆపడం లేదు. ఈరోజు మ్యాచ్ ముగిసిన తర్వాత బాబర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ జట్టులో ఉన్న అందరూ ఆటగాళ్లు మ్యాచ్ విన్నర్లే అనే స్టేట్మెంట్ అనేది ఇచ్చాడు.

Advertisement

దీని తర్వాత.. అవును పాకిస్థాన్ లో అందరూ మ్యాచ్ విన్నర్లే.. నువ్వు తప్పా అని ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచ కప్ లో జరిగిన నాలుగు మ్యాచ్ లలో ఆడిన బాబర్ కనీసం డబల్ డిజిట్ స్కోర్ అనేది చేయలేదు. ఇండియా పై పరుగులు చేయని బాబర్ ఆ తర్వాత మూడు మ్యాచ్ లలో 4 , 4, 6 చొప్పున కేవలం 14 పరుగులే చేయడం గమనార్హం.

ఇవి కూడా చదవండి :

ఇండియాను ఓడిస్తే పెళ్లి చేసుకుంటా అంటున్న పాక్ నటి..!

ఇండియా జట్టులో ఇదే గొప్పతనం..!

Visitors Are Also Reading