Home » తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీదే జోరు.. టైమ్స్ నౌ సర్వే లో సంచలన విషయాలు వెలుగులోకి..!

తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీదే జోరు.. టైమ్స్ నౌ సర్వే లో సంచలన విషయాలు వెలుగులోకి..!

by Anji
Ad

దేశవ్యాప్తంగా మరి కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేల జోరు కొనసాగగా.. తాజాగా ఎంపీ ఎన్నికల్లోనూ   సర్వేలు రాజకీయాల్లో హాల్ చల్ చేస్తున్నాయి. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే సర్వేను టైమ్స్ నౌ సంస్థ  విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో ఇప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే మొత్తం 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్  పార్టీ 9 స్థానాలు, బీజేపీ 5 స్థానాలు, బీఆర్ఎస్ 2 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం కైవసం చేసుకుంటాయని అంచనా వేసింది.

Advertisement

Advertisement

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ  అదే ఉత్సాహాన్ని త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కొనసాగించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో గెలిచే గుర్రాలకే టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఇండియా టుడే సంస్థ లోక్ సభ ఎన్నికలపై తెలంగాణలో నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో మొత్తం 17 స్థానాల్లో 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని పేర్కొంది. కాంగ్రెస్‌కు 41.2 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇదే జరిగితే.. జాతీయ రాజకీయాల్లో ఇండియా కూటమికి బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.

తెలంగాణను పదేళ్లు పాలించిన గత టీఅర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీకి  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏమైనా లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తోన్న బీఆర్ఎస్ పార్టీకి.. అలాగే అన్ని స్థానాల్లో కాషాయ జెండా ఎగవేయాలని భావిస్తోన్న బీజేపీకి  ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే మరో షాక్ ఇచ్చింది.

Also Read :   కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా యువరాజు లాంచ్ కావడం లేదు: నరేంద్ర మోడీ

Visitors Are Also Reading