Home » కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా యువరాజు లాంచ్ కావడం లేదు: నరేంద్ర మోడీ

కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా యువరాజు లాంచ్ కావడం లేదు: నరేంద్ర మోడీ

by Sravya
Ad

రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉదేశిస్తూ పరోక్షంగా సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ యువరాజుని స్టార్ అప్ గా ప్రెజెంట్ చేసిందని అయితే నాన్ స్టార్ అప్ తప్పని తేలిందని చెప్పారు. మోడీ కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా లాంచ్ చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. స్వతంత్ర దేశంలో నేను పుట్టాను. నా ఆలోచనలు స్వతంత్రంగా ఉంటాయని ప్రధాన నరేంద్ర మోడీ అన్నారు.

modi

Advertisement

Advertisement

తాను బానిసత్వానికి వ్యతిరేకమని చెప్పారు. ప్రభుత్వం నాశనం చేస్తున్నామని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని బిఎస్ఎన్ఎల్ నాశనం చేసింది ఎవరు అని అన్నారు. ఎయిర్ ఇండియా ని దెబ్బతీసింది ఎవరు అని ప్రశ్నించారు. ప్రస్తుతం హెచ్ఏఎల్ రికార్డులు వస్తాయి, లాభాలని సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎల్ఐసి ఎక్కడుందని అన్నారు. ఇప్పుడు ఎల్ఐసి షేర్ రికార్డ్ స్థాయిని అందుకుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అలానే ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ 2014లో 234 పిఎస్సీలు ఉంటే ఇప్పుడు 254 కి చేరాయని అన్నారు. పదేళ్లలో పిఎస్యుల విలువ 9.5 లక్షల కోట్ల నుండి 17 లక్షల కోట్లకు చేరిందని నరేంద్ర మోడీ చెప్పారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading