Home » రోహిత్, కార్తీక్ లతో ప్రచారం చేస్తున్న మన పోలీసులు..!

రోహిత్, కార్తీక్ లతో ప్రచారం చేస్తున్న మన పోలీసులు..!

by Azhar
Ad
హైదరాబాద్ పోలీసులు ప్రజలకు ట్రాఫిక్ ఆంక్షలు అలాగే మిగిలిన వాటి గురించి సూచించడానికి… హెచ్చరించాడు కొత్త కొత్త మీమ్స్ తో వస్తారు అనే విషయం తెలిసిందే. ప్రతిసాయి ఏదో ఒక్క సినిమా లేదా మరేదైనా వైరల్ అవుతున్న వాటిని మీమ్స్ లోకి మలిచి ప్రజల ముందు ఉంచుతారు. అయితే ఇప్పుడు వారు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ లతో ప్రచారం అనేది చేసారు.
ఆసియా కప్ ముగిసిన తర్వాత ఇండియాలోనే భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుతో టీ20 సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్ లో రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ మధ్య సంఘటన ఎవరు మర్చిపోలేరు. రోహిత్ ఫన్నీగానే అయిన సీరియస్ గా దినేష్ ముఖాన్ని పట్టుకొని కనిపించాడు. అయితే ఇందులో చివరి మ్యాచ్ హైదరాబాద్ లో జరిగింది.
ఈ మ్యాచ్ లో రోహిత్ ధర్మ మాక్స్వెల్ రన్ ఔట్ సమయంలో దినేష్ కార్తీక్ హెల్మెట్ పైన ముద్దు పెట్టాడు. ఇక ఈ రెండు ఫోటోలను వాడుతూనే హైదరాబాద్ పోలీస్ ప్రజలకు హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత వివరించారు. రోహిత్ సీరియస్ అయిన ఫోటోను పొట్టి.. హెల్మెట్ పెట్టుకోకపోతే అంటూ.. ముందు పెట్టిన ఫోటో పెట్టి హెల్మెట్ పెట్టుకుంటే అంటూ ఓ మీమ్ ను పోస్ట్ చేసారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ చేసిన ఈ పోస్ట్ అనేది వైరల్ అవుతుంది.

Advertisement

Visitors Are Also Reading