Home » మిడిల్ ఫింగర్ పై క్లారిటీ ఇచ్చిన గౌతమ్ గంభీర్.. అందుకోసమేనా ?

మిడిల్ ఫింగర్ పై క్లారిటీ ఇచ్చిన గౌతమ్ గంభీర్.. అందుకోసమేనా ?

by Anji
Ad

భారత మాజీ క్రికెటర్ బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ భారత్ నేపాల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలోని అభిమానులకు మిడిల్ ఫింగర్ చూపించాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. అభిమానులకు గౌతమ్ గంభీర్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ అసహనం వ్యక్తం చేయడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యవహారం మరింత వివాదాస్పదం విమర్శలు వ్యక్తం అవుతుండటంతో.. తాజాగా గౌతమ్ గా మీరు స్పందించాడు. ఈ వీడియో పై కూడా క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

Advertisement

తాను వెళ్లే సమయంలో మైదానంలో ఉన్న కొందరు పాకిస్తాన్ అభిమానులు భారత్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారని గౌతమ్ గంభీర్ క్లారిటీ ఇచ్చాడు. దానికి తనదైన శైలిలో వారికి సమాధానం చెప్పానని తెలిపారు. అభిమానులు కొందరు భారతదేశానికి వ్యతిరేక నినాదాలతో పాటు కాశ్మీర్ గురించి కూడా నినాదాలు చేస్తున్నారు. అందుకే అలా రియాక్ట్ అయ్యాను అని అనదైన స్టైల్ లో చెప్పుకొచ్చాడు గంభీర్. ఎవరైనా భారతకు వ్యతిరేకంగా నినాదాలు చేసినా భారత్కు వ్యతిరేకంగా మాట్లాడిన తాను కచ్చితంగా స్పందిస్తానని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గా మీరు చెప్పుకొచ్చాడు.
భారత్ నేపాల్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా అభిమానులకు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మిడిల్ ఫింగర్ చూపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అభిమానుల పట్ల గౌతమ్ గంభీర్ ప్రవర్తన పై నేటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అభిమానుల పట్ల ఇలాగే రియాక్ట్ అయ్యారని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు విరాట్ కోహ్లీ అభిమానులకి గంభీర్ అలా మిడిల్ ఫింగర్ చూపించాడని నేటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అహంకారం ప్రదర్శిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రియాక్ట్ అయిన గౌతమ్ గంభీర్ ఈ వివాదం పై ఓ క్లారిటీ ఇచ్చాడు.
https://twitter.com/Mafiya_Singh11/status/1698738740120989921?s=20
మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 
Visitors Are Also Reading