Home » రోజుకు 10 నిమిషాలు మౌనంగా ఉండడం వల్ల కలిగి ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

రోజుకు 10 నిమిషాలు మౌనంగా ఉండడం వల్ల కలిగి ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా పెద్ద పెద్ద శబ్దాలు, గట్టి గట్టిగా అరుచుకోవడం మన శరీరంతో పాటు  మనస్సు, మెదడును కూడా ప్రభావితం చేస్తుంది. దీంతో మన ఒత్తిడి పెరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో రోజుకు కనీసం 10 నిమిషాల పాటు మౌనంగా ఉండడం వల్ల మనలో ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం ఒక అద్భుతమైన మార్గం. ప్రతి మతం, సంస్కృతిలో ప్రశాంతంగా.. నిశ్శబ్దంగా ఉండడానికి ప్రాముఖ్యత ఇస్తారు.  కొందరూ  పగటిపూట కొద్దిసేపు ప్రశాంతంగా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని రుజువు చేస్తుంది. చాలా మంది మనస్తత్వవేత్తలు ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఏకాగ్రతను పెంచేందుకు మనశ్శాంతిని, సానుకూల ఆలోచనను పెంచేందుకు ప్రతీరోజు కనీసం 10 నిమిషాలు మౌనంగా ఉండాలని లేదా నిశ్చలంగా ఉండాలని సూచిస్తున్నారు.

Advertisement

మనం కొంత సమయం మౌనంగా ఉన్నప్పుడు మనతో మనం మాట్లాడుకునే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో మనం ధ్యానం చేస్తాం. ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది. మెదడుకు విశ్రాంతిని ఇస్తుంది. మౌనంగా చేసే ధ్యానం మన మెదడుకు కొత్త శక్తినిస్తుంది. మన మనస్సును ప్రశాంతపరుచుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుతుంది. ఒత్తిడిని పెంచే హార్మోన్ల స్థాయిని బట్టి కూడా తగ్గిస్తుంది. కొంత సమయం పాటు మౌనంగా ఉండడం వల్ల మెదడు కణాలను పునరుత్పత్తి చేస్తుంది. వాటి పునర్నిర్మాణం మెదడు శక్తిని పెంచుతుంది. మన ఏకాగ్రత పెరిగి మెదడుకు పదును పెడుతోంది. ప్రస్తుతం ఒత్తిడి జీవితంలో ధ్యానం కచ్చితంగా చేయాల్సి అవసరముంది. ఆందోళన, ఒత్తిడి ఇతర మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు మౌనంగా ఉండడం ఉత్తమం. మౌనం చేసే ధ్యానంతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

Advertisement

Also Read :  పెద్ద పేగు క్యాన్సర్ కి ఈ లక్షణాలు సంకేతం కావచ్చు.. వాటిని ఎలా గుర్తించాలంటే..?

Manam News

ప్రతీ రోజూ ధ్యానం చేయడంతో ఎలాంటి ఒత్తిడిని అయినా జయించవచ్చు. ఒత్తిడిని దూరంగా ఉంచితే రోగనిరోధకశక్తి కూడా మెరుగుపడుతుంది. ప్రతీరోజూ ధ్యానం చేయడంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో భయం, ఆందోళన, ఉద్రిక్తతలను దూరం చేసుకోవచ్చు. రక్తపోటు సమస్య నుంచి బయట పడేందుకు ప్రతీ రోజు ధ్యానం చేయడం ఉత్తమం. సంతులిత ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం, ధ్యానం చేయడం వల్ల అధికరక్తపోటు నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రతి రోజూ  సుమారు 30 నిమిషాల పాట ధ్యానం చేయడంతో  జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ధ్యానంతో నిద్రలేమి సమస్యతో ఉపశమనం కలుగుతుంది. ధ్యానం చేయడంతో అన్నింటికంటే ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

 Also Read :  “డయాబెటిస్” ఉన్నవారు వేరుశనగలు తినవచ్చా ? తింటే ఏం అవుతుంది ?

Visitors Are Also Reading