Home » ప్రభాస్ సలార్ నుంచి క్రేజీ అప్డేట్.. అసలు కథ అదేనా ?

ప్రభాస్ సలార్ నుంచి క్రేజీ అప్డేట్.. అసలు కథ అదేనా ?

by Anji
Ad

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా మూవీలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే దాదాపు ఐదు ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నాడు. తాజాగా ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. కేజీఎఫ్ సినిమా తర్వాత అంతకుమించి అనే విధంగా సలార్ సినిమాని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటం ఉండడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ కంప్లీట్ నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రలో కనిపించబోతున్నారట. 

Also Read :  రవితేజ హీరోగా ఎదగడానికి పరోక్షంగా ఆ హీరో కారణమయ్యాడా ?

Advertisement

అదేవిధంగా  జగపతిబాబు, పృధ్విరాజ్, సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన లుక్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ సినిమా కచ్చితంగా ప్రభాస్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ పూర్తి చేసే పనిలో ఉన్నారట నిర్మాత. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం అయింది. ఈ మూవీ షూటింగ్ 2021లో ప్రారంభం కాగా.. ఆ తర్వాత చాలా ఎక్కువ గ్యాప్ తీసుకోవడంతో పాటు ప్రభాస్ మల్టిపుల్ ప్రాజెక్టులను టేకప్ చేయడంతో ఈ సినిమాతో పాటు ఆ సినిమాలో కూడా వర్క్ చేయడంతో సినిమా లేట్ అవుతూ వచ్చింది. 

Advertisement

Also Read :  టాలీవుడ్ లో కాకులే కీలకం.. అవి ఉంటే సినిమా హిట్టా ? 

ఫైనల్ గా ఈ సినిమాను మే నెలలో పూర్తి చేయనున్నారు. ఫైనల్ గా ఈ చిత్రం యొక్క షూటింగ్  మే నెలకి పూర్తిచేసి సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు. అయితే ఫైనల్ షెడ్యూల్ లో సలార్ 2 కి సంబంధించిన మరో రెండు సీన్స్ కూడా షూట్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది. సలార్ పార్ట్ వన్ క్లైమాక్స్ లో సీక్వెల్ ఎలివేషన్ కోసం రెండు సీక్వెన్స్ ని టీజర్ రూపంలో చూపించాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా దాదాపు రూ.1000 కోట్ల కలెక్షన్ టార్గెట్ తో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఆశించిన ఫలితం వస్తుందో లేదో విడుదలైతే కానీ తెలియదు. 

 Also Read :  దసరా వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ స్థానంలో సాయి పల్లవి నటిస్తే ఎలా ఉండేదో తెలుసా ?

Visitors Are Also Reading