చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఆరోపించారు. చైనా నౌక ఒకటి ఆస్ట్రేలియా సిఘా విమానం పై లేజర్ ను ఉపయోగించిన తరువాత మారిసన్ ఈ విధంగా స్పందించారు. చైనా కవ్వింపు చర్యలుగానే వీటిని నేను చూస్తానని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా రక్షణ మంత్రి పీటర్ పీటర్ డట్టోన్ మాట్లాఆరు. ఇదొక ప్రమాదకర చర్య.. చైనా దూకుడు చర్యలపై ఎవరూ మాట్లాడకూడదని బీజింగ్ భావిస్తున్నట్టుంది.
ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన పీ-8ఏ పొసైడాన్ నిఘా విమానంపై లేజర్ను ప్రయోగించినట్టు ఆస్ట్రేలియా రక్షణ శాఖ ప్రకటించింది. పీఎల్ఏకు చెందిన రెండు నౌకలు టోరస్ జలసంధిని దాటుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లేజర్ ప్రభావంతో పైలట్లు గందరగోళానికి గురికావడం కానీ, తాత్కాలికంగా వారి కంటి చూపు దెబ్బతినడం కానీ జరుగుతుందని ఆస్ట్రేలియా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నౌకలు కోరల్ సముద్రంలో ఉన్నాయి. రెండేండ్ల క్రితం అమెరికా నిఘా విమానంపై కూడా చైనా లేజర్లను వాడినట్టు ఆరోపణలున్నాయి.
Also Read : ఏటీఎం వ్యాన్ డ్రైవర్ రూ.36 లక్షలతో పరార్.. ఎక్కడంటే..?