Home » వుమెన్స్ టీ20 ఛాలెంజ్ డేట్స్ ప్రకటించిన బీసీసీఐ..!

వుమెన్స్ టీ20 ఛాలెంజ్ డేట్స్ ప్రకటించిన బీసీసీఐ..!

by Azhar
ప్రపంచంలోనే ధనికవంతమైన క్రికెట్ బోర్డుగా పేరు పొందింది బీసీసీఐ. అయితే ఈ బోర్డును ఆ లెవల్ కు తీసుకువెళ్ళింది మాత్రం ఐపీఎల్ అనే చెప్పాలి. ఈ ఐపీఎల్ ను చూసి ఈ మధ్య వచ్చిన వేరే దేశాల టీ20 లీగ్స్ లో కూడా మహిళల కోసం ప్రత్యేక లీగ్ ను ఏర్పాటు చేసాయి. కానీ మన బీసీసీఐ మాత్రం మహిళా క్రికెటర్లను గాలికే వదిలేసింది.
ఈ క్రమంలోనే బీసీసీఐ పై వస్తున్న విమర్శలతో ఈ మధ్యే మహిళల ఐపీఎల్ పై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఏడాది నుండి మహిళలకు ఐపీఎల్ నిర్వహిస్తాం అని చెప్పింది. అయితే ఇన్ని రోజులు కేవలం మూడు జట్లతో వుమెన్స్ టీ20 ఛాలెంజ్ పేరిట ఓ లీగ్ నిర్వహిస్తూ వచ్చింది బీసీసీఐ. కానీ కరోనా కారణంగా గత రెండేళ్లుగా అది జరగడం లేదు.
కానీ ఈ ఏడాది మళ్ళీ వుమెన్స్ టీ20 ఛాలెంజ్ నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పురుషుల ఐపీఎల్ ప్లే ఆఫ్స్ దశలో అంటే మే 23న ఈ లీగ్ ప్రారంభమవుతుంది. 23, 24, 26 తేదీల్లో మూడు జట్లు రెండేసి మ్యాచ్ లు ఆడుతాయి. అందులో టాప్ లో ఉండే రెండు జట్లు 28న ఫైనల్స్ లో తలపడుతాయి. ఇక 29న పురుషుల ఐపీఎల్ ఫైనల్స్ ఉన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
Visitors Are Also Reading