Home » పరిటాల రవి, చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య అసలు గొడవ ఏమిటి ? నిజ నిజాలు ఇవే..!

పరిటాల రవి, చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య అసలు గొడవ ఏమిటి ? నిజ నిజాలు ఇవే..!

by Sravya
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి 150 కి పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మంచి స్టార్ హీరోగా ఎదిగారు అలానే పవన్ కళ్యాణ్ కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి హీరోగా పేరు తెచ్చుకోవడంతో పాటుగా ఇప్పుడు రాజకీయాల మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. చిరంజీవి గారు ఎన్డీఏ కి సపోర్ట్ ఇచ్చిన రోజే అనుకున్నారట కొందరు మళ్ళీ పరిటాల రవి వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇష్యూ పైకి లేపుతారని అనుకున్నట్లే ఆరోజు జరిగింది అయితే అసలు వీళ్ళ మధ్య ఏం జరిగింది..? ఈ విషయంపై క్లారిటీగా చూసేద్దాం.

Advertisement

అసలు పరిటాల రవి చిరంజీవిని కానీ పవన్ కళ్యాణ్ ని కానీ కలిసిన రోజు లేదు అయితే ఫిలింనగర్ లో పరిటాల రవి ఇంటి పక్కన ఉన్న 500 గజాలు స్థలం చిరంజీవి గారిది. సీనియర్ ఆర్టిస్ట్ జగ్గారావు గారి దగ్గర చిరంజీవి గారు ఈ స్థలం కొనుక్కున్నారు. జూబ్లీహిల్స్ లో కారు బాంబ్ ఆక్సిడెంట్ జరిగినప్పుడు పరిటాల రవి భద్రతా కారణాల వలన పక్కన ఉన్న 500 గజాలని కొనుగోలు చేయాలని అనుకున్నారు. అయితే జగ్గారావు గారు చిరంజీవికి ఆ స్థలాన్ని అమ్మడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంది. కొంచెం డబ్బులు కూడా ఇచ్చేసారు.

Also read:

Advertisement

Also read:

ఈ 500 గజాలకి బదులుగా మాదాపూర్ లో ఒక ఎకరం స్థలాన్ని ఇస్తానని పరిటాల రవి చెప్పారు అయితే చిరంజీవి 500 గజాల మార్కెట్ రేటుకి డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది. మాకు వేరే స్థలం ఏమీ వద్దు అని చెప్పారట. అయితే ఈ సంఘటనలో పవన్ కళ్యాణ్ పాత్ర కానీ పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఏమీ లేదు. అయితే ఈ విషయం గురించి సరిగ్గా తెలియకుండా నెల్లూరు పేపర్ జమీన్ రైతు పవన్ కళ్యాణ్ దౌర్జన్యం చేశారని రాసింది అయితే మెగా ఫ్యామిలీ ఆరోజు కేసు కూడా వేసింది ఆ రోజు ఈ వార్తకి ఆధారాలు చూపించలేకపోయారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading