Home » ధోని కుట్ర చేశాడు.. కావాలనే రన్ అవుట్ అయ్యాడు – యువరాజ్ తండ్రి సంచలనం

ధోని కుట్ర చేశాడు.. కావాలనే రన్ అవుట్ అయ్యాడు – యువరాజ్ తండ్రి సంచలనం

by Bunty
Ad

2019 సంవత్సరంలో వన్డే ప్రపంచ కప్ జరిగిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఈ వన్డే వరల్డ్ కప్ ను ఎదుర్కొంది టీమిండియా. ఇక విరాట్ కోహ్లీ అద్భుతమైన కెప్టెన్సీ తో… ఈ టోర్నమెంట్లో వేగంగా ఏడు మ్యాచ్లు గెలిచి టేబుల్ టాపర్గా నిలిచింది టీమిండియా. అయితే సెమీఫైనల్ రేసులో… ఓటమి చెంది ఇంటి పాలయింది టీమిండియా.

Advertisement

న్యూజిలాండ్ చేతిలో చివరి వరకు పోరాడి, ఓటమి చెందింది. అయితే ఈ మ్యాచ్ పై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగి రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోని కారణంగానే టీమిండియా 2019 వన్డే ప్రపంచ కప్ సెమి ఫైనల్లో ఓటమిపాలైందని ఆరోపణలు చేశాడు యోగి రాజ్ సింగ్. మహేంద్ర సింగ్ ధోని ఒక సార్ధపరుడని… 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్ లో టీమిండియా ఓటమికి ధోని కారణమని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Advertisement

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా కు వరల్డ్ కప్ రాకూడదని ధోని కుట్ర చేశాడని తెలిపాడు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టాడు యోగి రాజ్ సింగ్. న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో… చివరలో ధోని రన్ అవుట్ అవుతాడు. అక్కడ ధోని రానౌట్ కాకపోతే టీమిండియా కచ్చితంగా గెలిచేది అంతేకాదు వరల్డ్ కప్ కూడా వచ్చేది. కానీ ధోని కావాలని రన్ అవుట్ అయ్యి… టీమిండియాను ఓడించాడని యువరాజ్ సింగ్ తండ్రి యోగ రాజ్ సింగ్ విరుచుకుపడ్డారు.

ఇవి కూడా చదవండి

Ys Sharmila : వైఎస్ షర్మిల కొడుకు హీరోగా సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

టెస్టు క్రికెట్ కు వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్

MS Dhoni Assets : ఎంఎస్ ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Visitors Are Also Reading