Home » యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా స్కోరు ఎంతంటే..?

యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా స్కోరు ఎంతంటే..?

by Anji
Ad

విశాఖపట్నం టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 396 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా తరపున యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 209 పరుగులు చేసి ఔటైనా జట్టును 400 పరుగులకు మించి తీసుకెళ్లలేకపోయాడు. అతను తప్ప జట్టులోని మరే ఇతర బ్యాట్స్‌మెన్ కూడా యాభై పరుగులు చేయలేకపోవడం గమనార్హం. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ తలో 3 వికెట్లు తీశారు. టామ్ హార్ట్లీకి ఒక వికెట్ దక్కింది.

Advertisement

భారత జట్టు కెప్టెన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన జైస్వాల్..  ప్రారంభం నుంచి ఫాస్ట్ బ్యాటింగ్‌ పై దృష్టి  సారించాడు.  మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ  14 పరుగులు మాత్రమే చేసి  ఔటయ్యాడు.  క్రీజులో నిలిచిన యశస్వి జైస్వాల్ 151 బంతుల్లోనే భారీ సెంచరీ చేసి టీమ్ ఇండియాకు ఆసరాగా నిలిచాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి జైస్వాల్ 179 పరుగులు చేసి భారత జట్టును 6 వికెట్ల నష్టానికి 336 పరుగుల వద్ద నిలిపాడు. రెండో రోజు ఆట ప్రారంభంలో జైస్వాల్ విజయవంతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు. అశ్విన్‌తో కలిసి 2వ రోజు ఆట ప్రారంభించిన జైస్వాల్ 277 బంతుల్లో డబుల్ సెంచరీతో చెలరేగాడు. మధ్యలో అశ్విన్ (20) కొద్దిసేపు ఆకట్టుకున్నాడు.

Advertisement

ఇలా యశస్వి జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ముందుకు సాగాడు. దీంతో జేమ్స్ అండర్సన్ బంతిని కొట్టేందుకు ప్రయత్నించి.. జానీ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో జైస్వాల్ 290 బంతుల్లో 7 సిక్సర్లు, 19 ఫోర్లతో 209 పరుగుల విజయవంతమైన ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా 6 పరుగులు చేసి రెహాన్ అహ్మద్ క్యాచ్ పట్టాడు. చివరి వికెట్ గా ముఖేష్ కుమార్ (0) ఔటయ్యాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు  ఆలౌట్ అయింది.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading