Home » IPL వేలంలో జాక్ పాట్ కొట్టిన కర్నూలు అమ్మాయి

IPL వేలంలో జాక్ పాట్ కొట్టిన కర్నూలు అమ్మాయి

by Bunty
Ad

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో కర్నూలు అమ్మాయి అంజలి శర్వాణి లక్కీ ఛాన్స్ కొట్టేసింది. దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం జరుగుతున్న ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ లో పోటీ పడుతున్న భారతజట్టులో మెంబర్ గా ఉన్న శర్వాణి నిన్న రూ.30 లక్షలు కనీస ధరతో వేలంలోకి వచ్చింది. ఫాస్ట్ బౌలర్గా ఇటీవల ప్రశంసలు అందుకున్న శర్వాణి కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరికి యూపీ వారియర్స్ రూ.55 లక్షలకి ఈ కర్నూలు అమ్మాయిని దక్కించుకుంది.

Advertisement

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అంజలి శర్వాణి గత ఏడాది చివర్లో భారత ఉమెన్స్ టీమ్ లోకి ఎంటర్ ఇచ్చింది. ఆస్ట్రేలియాలో జరిగిన టి20 మ్యాచ్ లో సత్తా చాటిన శర్వాణి మూడు వికెట్లు పడగొట్టింది. ఇప్పటివరకు భారత తరుపున ఆమె ఆడిన టీ20 మ్యాచ్ లు కేవలం ఆరు మాత్రమే. కానీ బౌలర్గా ఆమె స్కిల్స్ పై పూణే వారియర్స్ నమ్మకం ఉంచింది. మిగిలిన ఫ్రాంచైజీలతో పోటీపడి దక్కించుకుంది.

Advertisement

వాస్తవానికి చాలామంది సీనియర్ క్రికెటర్లు కూడా అన్ సోల్డ్ గా మిగిలిపోయారు. కానీ పెద్దగా అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేకపోయినా, అంజలి కోసం ప్రాంచైజీలు పోటీ పడటం విశేషం. పదేళ్ల క్రితం అండర్-19 ఉమెన్స్ జట్టులో ఆడిన అంజలి శర్వానికి కొన్ని రోజులు రైల్వేస్ కి ఆడింది. అనంతరంలో 2019-2020లో ఆంధ్ర జట్టుకి, ఇండియా-బీ జట్టులో ఆడుతూ భారత సెలెక్టర్ల దృష్టిలో పడింది. అలా ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగింది.

READ ALSO : హైదరాబాద్ ప్రజలకు ఫుల్ సేఫ్టీ…నగరంలో కొత్తగా 20 కొత్త పోలీస్ స్టేషన్లు

Visitors Are Also Reading