Home » టీ 20 జట్టులో కోహ్లీ-రోహిత్ లేకపోవడాని కారణం ఏంటి..? టీమిండియా మాజీ కెప్టెన్ ఫైర్..!

టీ 20 జట్టులో కోహ్లీ-రోహిత్ లేకపోవడాని కారణం ఏంటి..? టీమిండియా మాజీ కెప్టెన్ ఫైర్..!

by Anji
Ad

వెస్టిండిస్ తో జరిగే సిరీస్ కి భారత జట్టును ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ టీ 20 సిరీస్ కి ఎంపిక చేసిన జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఎందుకు చోటు దక్కలేదు. ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు జట్టు నుంచి తప్పుకోవడానికి కారణం ఏంటి..? అనే ప్రశ్న తలెత్తింది. ఎందుకు ఇద్దరు దిగ్గజాలను జట్టు నుంచి తప్పించినప్పటికీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎలాంటి నిర్దిష్ట కారణాలను వెల్లడించలేదు. ఇప్పుడు దీనిపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి ప్రశ్నలు సంధించాడు.

Advertisement

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను టీ 20 జట్టులోకి ఎందుకు ఎంపిక చేయలేదో అర్థం కావడం లేదు. ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. విదేశీ సిరీస్ ల నుంచి ఇద్దరూ ఆటగాళ్లను తప్పించడంపై గంగూలీ అసంతృప్తి వ్యక్ం చేసాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అద్భుతమైన ఫామ్ లో ఉన్నట్టు స్పష్టంగా అర్థం అవుతోంది. కోహ్లీని జట్టు నుంచి ఎందుకు తప్పించారని దాదా ప్రశ్నించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో ఉండాల్సిందని అనుకుంటున్నాను. సెలక్షన్ కమిటీ వారిని జట్టు నుంచి ఎందుకు తప్పించిందో తనకు తెలియదు అని గంగూలీ పేర్కొన్నాడు.  అదే సమయంలో రింకు సింగ్, జితేష్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ లను టీ20 జట్టుకు ఎంపిక చేయకపోవడంపై కూడా గంగూలీ మాట్లాడాడు. ఇప్పుడే మంచి ప్రదర్శన చేయడం ప్రారంభించారు. ఇలాగే కొనసాగితే త్వరలో జట్టులో అవకాశం రావడం ఖాయమని చెప్పుకొచ్చాడు.

Advertisement

Manam News

భారత టీ 20 జట్టు : 

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ వికెట్ కీపర్, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్, తిలక్ వర్మ, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, సంజు శాంసన్ (వికెటల్ కీపర్), అవేష్ ఖాన్, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పబ్ జీ గేమ్ లో సహ ఆటగాడితో ప్రేమలో పడింది…! వీరి ప్రేమ కథలో ఎన్ని మలుపులు ఉన్నాయంటే..?

సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న సలార్ టీజర్..! ప్రభాస్ ఫాన్స్ కి పండగే పండగ..!

Visitors Are Also Reading