Home » బాలయ్య సినిమాకి ఓటీటీలో ముహూర్తం ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..?

బాలయ్య సినిమాకి ఓటీటీలో ముహూర్తం ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..?

by Anji
Ad

సంక్రాంతికి వీరసింహారెడ్డి పేరుతో థియేటర్లకు వచ్చి దుమ్ములేపారు బాలయ్య. జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మాసివ్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మాస్ మసాలా డైలాగ్స్, యాక్షన్ కి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. రెండు క్యారెక్టర్లలో మూడు గెటప్ లో బాలయ్య అదురగొట్టేశారని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. మన దగ్గర మాస్ సినిమాకి బీ, సీ సెంటర్లలో ఎంత ఈలలు గోలలు ఉంటాయో యూఎస్ లో అంతేస్థాయిలో పూనకాలతో ఊగిపోయి భారీ కలెక్షన్లు అందించారు ప్రవాస భారతీయులు. 

veerasimhareddy-review

Advertisement

బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఏకంగా రూ.100కోట్ల క్లబ్ లో చేరారు బాలకృష్ణ. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో గోపిచంద్ మలినేని నిర్మించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. హనీరోజ్, దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర, ఈశ్వరీరావు, మురళీశర్మ, కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్ స్టార్ వీరసింహారెడ్డి స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది.

veerasimhareddy

Advertisement

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 21 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు తెలుస్తోంది. గతంలో అఖండను దక్కించుకున్న డిస్నీ+ హాట్ స్టార్ వచ్చిన లాభాలతో స్టన్ అయిందట. అందుకే భారీ ధరకు వీరసింహారెడ్డి దక్కించినట్టు ఇండస్ట్రీ టాక్ వినిపిస్తుంది. వీరసింహారెడ్డి సినిమాకి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ మెయిన్ అస్సెట్ అని చెప్పాలి. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేశారు. సుగుణ సుందరి, మా బావ మనోభావాలు, జై బాలయ్య వంటి పాటలు ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అల్లాడించాడు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ దుమ్ములేపేశారు.  

Also Read :  వరుస సినిమాల్లో అల్లు అర్హ.. పవన్ కళ్యాణ్ సినిమాలోనూ ?

బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఏకంగా రూ.100కోట్ల క్లబ్ లో చేరారు బాలయ్య. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో గోపిచంద్ మలినేని నిర్మించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. హనిరోజ్, దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓటీటీ విడుదల డేట్ కోసం ఆతృతగా చూస్తున్నారు అభిమానులు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ + హాట్ స్టార్ వీరసింహారెడ్డి స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది.  

Also Read :  కనీసం నీ భర్తకు అయినా విలువ ఇవ్వు….యాంకర్ శివజ్యోతి పై నెటిజన్ ఫైర్…!

Visitors Are Also Reading