Home » మెగా అభిమానుల‌కు షాకింగ్ న్యూస్ చెప్పిన ఉపాస‌న‌..!

మెగా అభిమానుల‌కు షాకింగ్ న్యూస్ చెప్పిన ఉపాస‌న‌..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం అంటే దాదాపుగా అంద‌రితో ప‌రిచ‌యాలు ఉంటాయి. అలాంటి మెగా కుటుంబంలో ఏ చిన్న విష‌యం జ‌రిగినా రెండు రాష్ట్రాలు తెలుసిపోతుంది. తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న అభిమానుల‌కు షాకింగ్ న్యూస్ చెప్పారు. గ‌త వారం రోజుల క్రితం ఆమె క‌రోనా బారిన ప‌డ్డ‌ట్టు వెల్ల‌డించారు. రెండు సంవ‌త్స‌రాల నుంచి ప్ర‌జ‌లు పీడిస్తున్న ఈ మ‌హ‌మ్మారి ఇప్పుడిప్పుడే త‌గ్గుముఖం పట్టింద‌ని ఆనందించే లోపే మ‌రొక‌సారి ఎటాక్ కావ‌డం ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.


ఉపాస‌న తాజాగా అభిమానుల‌తో ఈ విష‌యాన్ని పంచుకుంది. గ‌త వారం క‌రోనా పాజిటివ్ అని తేలింది. ముందే వ్యాక్సిన్ తీసుకోవ‌డం ద్వారా స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మాత్ర‌మే క‌నిపించాయి. దీంతో డాక్ట‌ర్స్ నన్ను కేవ‌లం పారాసిట‌మ‌ల్, విట‌మిన్ టాబ్లెట్స్ వాడాల‌ని సూచించారు. ఈ మ‌హ‌మ్మారి సోక‌డంతో చాలా మంది నేను నీర‌సించిపోతాన‌ని.. జ‌ట్టు రాలిపోవ‌చ్చ‌ని, బాడీ పెయిన్స్ వంటి స‌మ‌స్య‌లు రావ‌చ్చు అని చెప్పారు.

Advertisement

Advertisement


ఇప్పుడూ ఆ స‌మ‌స్య‌లు ఏమి నాలో క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే నేను మెంట‌ల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాను. అందుకే నాకు ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్తలేదు. మ‌ళ్లీ వైర‌స్ విజృంభిస్తుందా..? అంటే చెప్ప‌లేను కానీ.. మ‌నం జాగ్ర‌త్త‌గా ఉండ‌డం త‌ప్ప‌నిస‌రి. చెన్నైలోని తాత‌య్య-అమ్మ‌మ్మ‌ల‌ను క‌లిసేందుకు క‌రోనా ప‌రీక్ష‌లు చేసుకోవ‌డం వ‌ల్ల వైర‌స్ బ‌య‌ట‌ప‌డింది. లేదంటే అస‌లు తెలిసేదే కాదు. అందుకోసం ఎప్పుడూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఉపాస‌న సూచించారు. ఈ విష‌యం తెలుసుకున్న మెగా అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటూ ప‌లువురు అభిమానులు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

Also Read : 

మే నెల‌లో విడుద‌లైన మ‌హేష్ బాబు సినిమాలు ఇవే..!

వాకింగ్ చేస్తున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి.. గుర్తుంచుకోండి..!!

 

Visitors Are Also Reading