సాధారణంగా ఒకప్పుడు తెలుగులో పాత సినిమాలు రీ రిలీజ్ అవుతుండేవి. శాటిలైట్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వడంతో వీటి ట్రెండ్ కాస్త తగ్గింది. తాజాగా గత కొద్ది రోజుల నుంచి తెలుగులో పాత సినిమాల రీ రిలీజ్ అనే ట్రెండ్ మళ్లీ ప్రారంభమైంది. ఈ మధ్య పాత సినిమాలను రీ మాస్టర్ చేసి 4కె మరోసారి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ కోవలోనే ఘరానా మొగుడు, పోకిరి, జల్సా, బిల్లా, చెన్నకేశవరెడ్డి, ఖుషి, సింహాద్రి, తొలిప్రేమ, బిజినెస్ మేన్ వంటి సినిమాలు రీ రిలీజ్ లో మంచి వసూళ్లనే సాధించాయి. అందులో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ గురించి మనం తెలుసుకుందాం.
Advertisement
బిజినెస్ మేన్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బిజినెస్ మేన్ ఈ మూవీ రీ రిలీజ్ లో మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ.5.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
ఖుషీ
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషీ మూవీ మంచి వసూళ్లనే సాధించింది. ఈ సినిమా ఫస్ట్ రోజు రూ.4.51కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవరాల్ గా ఈ మూవీ రూ.7.46 కోట్ల గ్రాస్ వసూళ్లతో రీ రిలిజ్ సినిమాలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.
సింహాద్రి
ఎన్టీఆర్-దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన సింహాద్రి మూవీ ఫస్ట్ డే రూ.4.01 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవరాల్ రీ రిలీజ్ లో రూ.4.60 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
జల్సా
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన మూవీ జల్సా. ఈ సినిమా రీ రిలీజ్ లో రూ.3.20 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవరాల్ గా ఈ మూవీ రీ రిలీజ్ రూ.3.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఒక్కడు
Advertisement
మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఒక్కడు. ఈ సినిమా మొదటిరోజు రూ.2.05 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవరాల్ గా ఈ మూవీకి రీ రిలీజ్ రూ.2.54కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్షన్లు వసూలు చేసింది.
ఈ నగరానికి ఏమైంది
విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ఈ నగరానికి ఏమైంది. ఈ చిత్రం రీ రిలీజ్ లో మొదటి రోజు రూ.1.78 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవరాల్ గా రీ రిలీజ్ లో రూ.3.40 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 3లో నిలిచింది.
పోకిరి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పోకిరి. ఈ చిత్రం మళ్లీ విడుదల చేస్తే రూ.1.73 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా రీ రిలీజ్ లో రూ.1.73కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఆరేంజ్
రామ్ చరణ్, జెనీలియా హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ఆరేంజ్. ఈ చిత్రం మొదటి రోజు రూ.1.53 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం రీ రిలీజ్ రూ.3.36కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
దేశముదురు
అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ దేశముదురు. ఈ సినిమా విడుదలలో తొలిరోజు రూ.1.50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా రీ రిలీజ్ లో రూ.1.65 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
సూర్య సన్నాప్ కృష్ణన్
తమిళ స్టార్ హీరో సూర్య తండ్రీ కొడుకులుగా నటించిన మూవీ సూర్య సన్నాఫ్ కృష్ణన్. గౌతమ్ వాసుదేవమీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజు రూ. 1.45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ 10లో నిలిచింది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పవన్ మూడు పెళ్ళిళ్ళపై సంచలన వీడియో రిలీజ్ చేసిన రేణు దేశాయ్..!