Home » మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ సినిమాకి టైటిల్ ఖరారు..!

మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ సినిమాకి టైటిల్ ఖరారు..!

by Anji
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవ‌ల సర్కారు వారి పాట సినిమా తో ప్రేక్ష‌కు ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా ఇటీవల షూటింగ్ ను స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి టీమ్ ఓ వీడియో ను కూడా వదిలింది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

Advertisement

ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. అక్కడే ఓ మూడు రోజులు షూట్ చేశారు. ఈ ఫస్ట్ షెడ్యూల్ లో కొన్ని హై ఆక్టేన్ ఎపిక్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారట. ఇక రెండో షెడ్యూల్ దసరా తర్వాత మొదలు కానుందని తెలిపారు చిత్ర నిర్మాత నాగ వంశీ. ఈ రెండో షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో షూట్ కానుందట.

Advertisement

Also Read :  ప్రశాంత్ నీల్ సినిమాలో విలన్ గా ఎన్టీఆర్..?

ఒక దాదాపుగా ఓ 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబుతో చేస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ అందరి అంచనాలు అందుకునేలా తెరకెక్కిస్తున్నారట. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు మొన్నటి వరకు పార్ధు అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్ రాగా.. ఇప్పుడు తాజాగా మరో టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్ ను దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అఆ, అత్తారింటికి దారేది, అర‌వింద స‌మేత వీర రాఘ‌వ వంటి సినిమా అ లెట‌ర్ మీద‌నే వ‌చ్చాయి. త్రివిక్రమ్ కి అ సెంటిమెంట్ కూడా కలిసి రావడంతో.. ఈ టైటిల్ ను ఖరారు చేశారట. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రానున్న‌ట్టు స‌మాచారం.

Also Read :  కార్తీకేయ-2 ఓటీటీలో విడుద‌ల ఎప్పుడంటే..?

Visitors Are Also Reading