Home » ఆమె సచివాలయంలో ఉద్యోగి.. ఆయన వాలంటర్.. వీరి లవ్ స్టోరీ లో మామూలు ట్విస్ట్ లు లేవు..!!

ఆమె సచివాలయంలో ఉద్యోగి.. ఆయన వాలంటర్.. వీరి లవ్ స్టోరీ లో మామూలు ట్విస్ట్ లు లేవు..!!

Ad

కొన్ని లవ్ స్టోరీలు అప్పుడప్పుడు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాంటిదే ఈ ఇద్దరి లవ్ స్టోరీ.. ఆమె సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ గా చేస్తోంది. అతను వాలంటర్.. వారిద్దరి మధ్య కాస్త పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసింది. కానీ వీరి పెళ్లికి కులాలు అడ్డు వచ్చాయి. కుల పెద్దలు అంగీకరించారని భయంతో వారి ఊరిలోని రామాలయంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దలు ఏమైనా చేస్తారనే భయంతో ఆ గుడిలోనే గడియ పెట్టుకొని దాక్కున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

also read:ఇరవై ఏళ్ల సినీ కెరీర్ లో అల్లరి నరేష్ కి ఫస్ట్ మాస్ హిట్.. ఉగ్రంకి పాజిటివ్..!

Advertisement

ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన గాయత్రి , అదే రూరల్ మండలం బుద్ధ పాలెంకు చెందిన నాగరాజు గాఢంగా లవ్ చేసుకున్నారు. అయితే గాయత్రి సచివాలయంలో ఉద్యోగం చేస్తోంది. అయితే నాగరాజు అదే సచివాలయంలో వాలంటీరుగా ఉన్నారు. ఈ సందర్భంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ ఇద్దరివి కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించారనే భావనతో వీరు గ్రామంలోని రామాలయానికి వెళ్లి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ పెద్దలు ఏమైనా చేస్తారని ఆలోచనతో రక్షణ కోసం గుడి లోపలే ఉండి తలుపులు వేసుకున్నారు.

Advertisement

also read:లేడీ గెటప్స్ లో కూడా అద్భుతంగా నటించిన హీరోలు..ఎవరంటే..?

అలా గుడిలోనే ఒకరోజు మొత్తం ఉన్నారు. చివరికి ఈ విషయం ఇరుగు పొరుగు తెలియడంతో వారి కుటుంబాలను ఒప్పిస్తే తలుపులు తీస్తామని తెగేసి కూర్చున్నారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్ సీఐ రవికుమార్, ఎస్సై చాణక్య గ్రామ పెద్దల సహాయంతో ఇద్దరిని బయటకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఇరువురి తరపు బంధువులతో పోలీస్ స్టేషన్ లో మాట్లాడించారు. వీరిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి గ్రామ పెద్ద సమక్షంలో ఇంటికి పంపారు.

also read:నరేష్, పవిత్రా లోకేశ్ ‘మళ్లీ పెళ్లి’ ముహుర్తం ఖరారు.. ఎప్పుడంటే ?

Visitors Are Also Reading