Home » రూ.20కోట్లతో సినిమా తెరకెక్కిస్తే వారంలోనే రూ. 50 కోట్లు.. ఇక తెలుగులో కూడా..!

రూ.20కోట్లతో సినిమా తెరకెక్కిస్తే వారంలోనే రూ. 50 కోట్లు.. ఇక తెలుగులో కూడా..!

by Anji
Ad

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతుంది. అలాంటి సమయంలో దాదాపుగా పెద్ద హీరోలు నటించే ఏ సినిమాను అయినా పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తే మంచి లాభాలుంటాయని భావిస్తున్నారు నిర్మాతలు.కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసి భారీ లాభాలు వచ్చేలా చేస్తున్నారు కొంత మంది. ఇటీవల విడుదలైన కాంతారా, లవ్ టుడే వంటి సినిమాలు తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి సూపర్ హిట్ సాధించాయి. 

Advertisement

అలాగే కోలీవుడ్ లో  లాస్ట్ వీక్ విడుదలైన మామన్నన్ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఈ చిత్రంలో వడివేలు, ఉదయనిధి స్టాలిన్, ఫాహద్ ఫాజిల్, కీర్తి సురేష్ వంటి స్టార్స్ నటించారు.వడివేలు కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఓ సీరియస్ పాత్రలో నటించారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళ ఆడియన్స్ కి అద్భుతం నచ్చేసిందనే చెప్పాలి. కర్ణన్ తెరకెక్కించిన మారి సెల్వరాజ్ మామన్నన్ మూవీతో సూపర్ హిట్ సాధించాడు. ఈ మూవీ రూ.20కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే వారం రోజుల్లోనే రూ.50కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తోంది. 

Advertisement

ఇప్పుడు ఈ మూవీని తెలుగులో కూడా విడుదలై చేస్తున్నారు. తెలుగులో నాయకుడు టైటిల్ తో మూవీ వస్తుంది. నాయకుడు పర్ఫెక్ట్ టైటిల్ అని తమిళంలో సినిమా చూసిన తెలుగు ఆడియన్స్ పేర్కొంటున్నారు. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఏషియన్ మల్టిప్లెక్స్ ప్రైవేట్ లిమిటేడ్,  సురేష్ ప్రొడక్షన్స్ తెలుగు హక్కులను సొంతం చేసుకొని నాయకుడు అనే టైటిల్ తో జులై 14న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే వడివేలు, కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే కాబట్టి ఈ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశముంది. నాయకుడు మూవీ తెలుగులో హిట్ అవుతుందో లేదో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 తీన్మార్ న్యూస్ యాంకర్ శివజ్యోతి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

 శ్రీలీల-వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..? 

ఎన్టీఆర్ పరువు తీయాలనుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading