Home » రజనీకాంత్ వాఖ్యాలతో NTR ఆత్మ ఘోషిస్తోంది – రోజా

రజనీకాంత్ వాఖ్యాలతో NTR ఆత్మ ఘోషిస్తోంది – రోజా

by Bunty
Ad

 

సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన సినీ నటుడు రజినీకాంత్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి లేపారు. ఈ వేడుకలో రజనీ చేసిన వాక్యాలపై వైసీపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. అయితే రజనీకాంత్ ఈ సభలో చేసిన వాక్యాలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు.

READ ALSO : శ్రీముఖి నడుము చూడడానికి రెడీ అయిపోయిన చిరంజీవి?

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై రజనీకాంత్ కు అవగాహన లేదని, ఆయన వాక్యాలతో ఎన్టీఆర్ ఆత్మ బాధపడుతుంది అన్నారు. ఎన్టీఆర్ ఏమన్నారో…రజినీకాంత్ కు వీడియోలు ఇస్తాను అన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించారని…కానీ రజనీకాంత్ వాక్యాలతో ఎన్టీఆర్ అభిమానులు బాధపడ్డారన్నారు. చంద్రబాబు లేనప్పుడే హైదరాబాద్ డెవలప్ అయ్యింది. విదేశాల్లో తెలుగువారు ఉద్యోగాలు పొందడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణమన్నారు.

Advertisement

READ ALSO :  సినిమాలు వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దగ్గుబాటి హీరో… అతను ఎవరో తెలుసా?

చంద్రబాబు కాదని రజనీకాంత్ తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. చంద్రబాబు విజన్ 2020 వల్ల టిడిపి 23 సీట్లు వచ్చాయని… విజన్ 2047 కి చంద్రబాబు ఏ దశలో ఉంటారో రజనీకాంత్ కి తెలుసా అంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి వాక్యాలు చేసి రజినీకాంత్ పై తెలుగు ప్రజలకు ఉన్న గౌరవాన్ని తగ్గించుకున్నారన్నారు మంత్రి. ఇన్ని గొప్పలు చెప్పే వాళ్ళు 27 ఏళ్లలో ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు.

READ ALSO : చచ్చినా ఆ హీరోయిన్ తో నటించను – ఎన్టీఆర్ సంచలన నిర్ణయం

Visitors Are Also Reading