Home » శ్రీముఖి నడుము చూడడానికి రెడీ అయిపోయిన చిరంజీవి?

శ్రీముఖి నడుము చూడడానికి రెడీ అయిపోయిన చిరంజీవి?

by Bunty
Ad

‘వాల్తేరు వీరయ్య’ వంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన తదుపరిచిత్రం ‘భోళా శంకర్’ లో కనిపించనున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఇప్పటికే కొన్ని షెడ్యూల్ లను కంప్లీట్ చేయగా, తాజాగా డబ్బింగ్ పనులను ప్రారంభించినట్లు వెల్లడించారు. హీరో అజిత్ నటించిన తమిళ సూపర్ హిట్ ఫిలిమ్ ‘వేదాళం’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’ ఈ ఏడాది ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానున్నట్టు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు.

READ ALSO :  సినిమాలు వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దగ్గుబాటి హీరో… అతను ఎవరో తెలుసా?

Advertisement

Advertisement

మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో చిరుకి చెల్లెలిగా నటి కీర్తిసురేష్ నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంలో పవన్ ‘ఖుషి’ సినిమాలో భూమిక నడుము చూసే సీన్ ను రీ క్రియేట్ చేస్తున్నారట చిరు. అది కూడా స్టార్ యాంకర్ శ్రీముఖితో. ఇది ఫన్నీ వేలో కొనసాగుతుందని టాక్.

READ ALSO : చచ్చినా ఆ హీరోయిన్ తో నటించను – ఎన్టీఆర్ సంచలన నిర్ణయం

Sreemukhi reveals her fangirl moment with Megastar Chiranjeevi; says, "Manishi mathrame kadu, Manasu kuda megastar ye" - Times of India

ఇది నిజమో కాదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఇది ఇలా ఉండగా, మేకర్స్ తాజా అనౌన్స్మెంట్ తో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ను ఇప్పటికే దాదాపు కంప్లీట్ చేసిన మూవీ యూనిట్… తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులను కూడా మొదలుపెట్టిందని తెలియడంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ అనౌన్స్మెంట్ తో పాటు దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా మూవీ టీం సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

READ ALSO : మందుబాబులకు గుడ్ న్యూస్… కింగ్ ఫిషర్ బీర్ పౌడర్ వచ్చేసింది…!

Visitors Are Also Reading