Home » మ్యాచ్ ను మధ్యలో ఆపేసిన రోహిత్.. ఎందుకో తెలుసా…?

మ్యాచ్ ను మధ్యలో ఆపేసిన రోహిత్.. ఎందుకో తెలుసా…?

by Azhar
Ad

ఇండియా – ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇప్పుడు వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న జరిగిన మొదటి వన్డే మ్యాచ్ ను రోహిత్ శర్మ కొంతసేపు ఆపేసాడు. కానీ అందుకు కారణం తెలుసుకున్న తర్వాత అందరూ రోహిత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే నిన్నటి మొదటి వన్డేలో బుమ్రా, షమీ అద్భుతమైన బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే. పిచ్ పేసర్లకు అనుకూలిస్తుండటంతో బుమ్రా, షమీ రెచ్చిపోయారు. దాంతో ఇంగ్లాండ్ జట్టు 110 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది.

Advertisement

అనంతరం 111 పరుగుల స్వల్ప లక్ష్య చేధనకు వచ్చింది భారత జట్టు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఆ సమయంలోనే రోహిత్ కొట్టి ఓ సిక్సర్ నేరుగా వెళ్లి స్టాండ్స్ లో ఓ చిన్నపాపకు తగిలింది. దాంతో ఆమె ఒక్కసారిగా ఏడవటంతో అక్కడ ఉన్న వారు పాపాను ఉకుంచె ప్రయత్నం చేసారు. ఇక అదే సమయంలో ఈ విషయాన్ని పసిగట్టిన ఇంగ్లాండ్ ఆటగాడు బెయిర్ స్టో రోహిత్.. తెలిపాడు. ఇక విషయం తెలుసుకున్న రోహిత్ శర్మ.. మ్యాచ్ ను కాసేపు నిలిపివేశాడు. అలాగే వెంటనే ఆ పాపా దగ్గరకు వైద్యులు వెళ్లాల్సిందిగా సూచించాడు.

Advertisement

ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ బృందం యొక్క వైద్య సిబ్బంది ఆ పాపాను వెళ్లి పరిశీలించారు. అప్పుడు అక్కడ కొంత పరిస్థితి సద్దుమణిగాక మళ్ళీ ఆట అనేది కొనసాగించారు. ఇక రోహిత్ చేసిన ఈ పనితో అందరూ తనపై ప్రశమసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటె.. నిన్నటి ఈ మొదటి వన్డేలో భారత జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇద్దరు ఓపెనర్లు రోహిత్, ధావన్ వికెట్ పడకుండా ఆ లక్ష్యాన్ని చేధించారు. అందువల్ల మూడు వన్డేల ఈ సిరీస్ లో టీం ఇండియా 0-1 తో ఆధిక్యంలోకి వెళ్ళింది..!

ఇవి కూడా చదవండి :

డివిలియర్స్ తర్వాత ఆ స్థానం సూర్య కుమార్ కే సొంతం…!

ఇంగ్లాండ్‌తో వ‌న్డే.. ఆ కీలక ఆట‌గాడు అందుకే ఆడ‌లేదా..?

Visitors Are Also Reading