Home » సినిమా నిర్మాతలతో సమస్య.. రవితేజ ఏం అన్నాడు అంటే..?

సినిమా నిర్మాతలతో సమస్య.. రవితేజ ఏం అన్నాడు అంటే..?

by Azhar
Ad

టాలీవుడ్ లోకి మాత్రమే కాకుండా ఏ సినిమా ఇండస్ట్రీలోకి అయిన సరే ఎటువంటి అండ అనేది లేకుండా రావడం చాలా కష్టం. అలా వచ్చిన కూడా హీరోగా నిలదొక్కుకొని కొనసాగడం ఇంకా కష్టం. కానీ ఇలా వచ్చిన వారికీ ఫ్యాన్ బేస్ అనేది చాలా గట్టిగ ఉంటుంది. రవితేజ అలాంటి లిస్ట్ లోనే ఉంటాడు. ఎటువంటి సపోర్ట్ అనేది లేకుండా రవితేజ సినిమాలోకి వచ్చి ఇప్పుడు ఓ స్టార్ హీరోగా మారాడు. అయితే సినిమా విషయంలో కూడా రవితేజ చాలా సైలెంట్ గా ఉంటాడు. ఎవరితో ఇప్పటివరకు రవితేజ గొడవలు అనేవి పెట్టుకున్నాడు అనే వార్తలు రాలేదు.

Advertisement

కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ తరహా వార్తలు అనేవి ఎక్కువయ్యాయి. రవితేజ చివరి సినిమా ఖిలాడీ దర్శకునితో.. రవితేజకు విబేధాలు వచ్చాయి అన్నారు. అలాగే ప్రస్తుతం రవితేజ యొక్క సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా నిర్మాత సుధాకర్ చెరుకూరితో కూడా విబేధాలు వచ్చాయి అన్నారు. ఈ సినిమాలో కొంతభాగం అనేది రీ షూట్ చేయవలసి వచ్చిందని… కానీ అలా చేయడానికి రవితేజ మళ్ళీ సపరేట్ గా డబ్బులు అడిగాడు అని వార్తలు వస్తున్నాయి. అలాగే తనకు డబ్బులు ఇవ్వకపోతే తాను డబ్బింగ్ కూడా చెప్పను అని రవితేజ అన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొట్టాయి.

Advertisement

అయితే ఈ విషయాల పైన తాజాగా రవితేజ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవితేజ మాట్లాడుతూ… ఈ నిర్మాతతో గొడవ అనే ప్రశ్న రాగ.. అవ్వని అబ్బదలే అని చెప్పాడు. కొంతమంది పనిపాట లేనివారు.. కూర్చొని ఇలా తమకు ఇషం వచ్చినట్లు రాస్తారు అని చెప్పాడు. నేనైతే అవ్వని పట్టించుకోను అని.. ఎపుడైనా అవి నా కంట పడితే చూసి నవ్వుకుంటాను అని పేర్కొన్నారు. అలాగే నిర్మాత సుధాకర్ చెరుకూరి నాకు మంచి స్నేహితుడు అని చెప్పాడు. ఆయనకు ఎవరితో గొడవలు లేవు.. రావు అని రవితేజ అన్నాడు.

ఇవి కూడా చదవండి :

నేనుంటే టీం ఇండియా అన్ని వరల్డ్ కప్స్ గెలిచేది అంటున్న శ్రీశాంత్…!

కోహ్లీ నాతో 20 నిముషాలు మాట్లాడు..!

Visitors Are Also Reading