Home » SAMANTHA : స‌మంత‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అరుదైన అవార్డు..!

SAMANTHA : స‌మంత‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అరుదైన అవార్డు..!

by Anji
Ad

హైద‌రాబాద్‌లోని తాజ్ డెక్క‌న్‌లో ఛాంపియ‌న్ ఆఫ్ చేంజ్ తెలంగాణ అవార్డులు ప్ర‌దానోత్స‌వం కార్య‌క్ర‌మం నిన్న జ‌రిగింది. సామాజిక స్పృహ‌ను పెంపొందించే ల‌క్ష్యంతో ఏటా ఈ అవార్డులు ఇస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇందులో భాగంగానే 2021 సామాజిక సేవా విభాగంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప‌లువురు బిజినెస్ వ్య‌క్తులు, సినీ ప్ర‌ముఖులు ఇత‌రుల‌కు అవార్డుల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం అంద‌జేసింది.

Advertisement

ముఖ్యంగా మై హోమ్ చైర్మ‌న్ రామేశ్వ‌ర‌రావు, పీవీ సింధు, డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్‌రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ బాల‌క్రిష్ట‌న్ వంటి ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

Advertisement

Also Read :  ‘మనసంతా నువ్వే’ సినిమాకు మొదట సెలెక్ట్ అయిన హీరో ఎవరో తెలుసా ?

వీరిలో గ్యాస్ట్రాల‌జిస్ట్ డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్‌రెడ్డి, పీవీ సింధు, మై మోమ్ రామేశ్వ‌ర‌రావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఎంపీ జోగిన‌పల్లి సంతోష్‌కుమార్‌, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌, యాక్ట‌ర్ ముఖేష్ రిషి అవార్డుల‌ను అందుకున్నారు. అయితే వీరితో పాటు టాలీవుడ్ హీరోయిన్ స‌మంత కూడా ఈ అవార్డును అందుకుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా స‌మంత ప్ర‌క‌టించింది.

Also Read :  మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తా…బాంబు పేల్చిన సురేఖ‌వాణి డాట‌ర్..!

Visitors Are Also Reading