Home » ‘మనసంతా నువ్వే’ సినిమాకు మొదట సెలెక్ట్ అయిన హీరో ఎవరో తెలుసా ?

‘మనసంతా నువ్వే’ సినిమాకు మొదట సెలెక్ట్ అయిన హీరో ఎవరో తెలుసా ?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో బిజీ షెడ్యూల్ వ‌ల్ల‌నో లేదంటే క‌థ న‌చ్చ‌క‌నో హీరోలు కొన్ని కథ‌ల‌ను రిజెక్ట్ చేస్తుంటారు. కానీ అదే క‌థ‌ను ద‌ర్శ‌కులు మ‌రో హీరోతో తెర‌కెక్కించి సూప‌ర్ హిట్లు కొడుతూ ఉంటారు. అలా టాలీవుడ్ లో చాలానే సినిమాలు ఉన్నాయి. అంతే కాకుండా అలా సినిమాను మిస్ చేసుకోవ‌డం వ‌ల్ల ఎంతో మంది హీరోలు న‌ష్ట‌పోయారు కూడా.

ALSO READ : హీరో నాని భార్య అంజ‌న బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే…!

Advertisement

manasantha nuvve

manasantha nuvve

అదే విధంగా మ‌హేశ్ బాబు కెరీర్ లో కూడా కొన్ని మంచి సినిమాల‌ను మిస్ చేసుకున్నారు. అలా మ‌హేశ్ బాబు మిస్ చేసుకున్న సినిమాల‌లో మ‌న‌సంతా నువ్వే సినిమా కూడా ఒక‌టి. వి ఎన్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఎంఎస్ రాజు ఈ సినిమాను తెర‌కెక్కించారు. 2001లో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది.

Advertisement

చిన్న‌ప్పుడే ఇద్ద‌రి మ‌న‌సులు క‌ల‌వ‌డం ఆ త‌ర‌వాత విడిపోవ‌డం లాంటి రొమాంటి ల‌వ్ స్టోరీగా ఈ చిత్రం తెర‌కెక్కించింది. సినిమాలోని తూనీగా తూనీగా పాట అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. సునీల్ కామెడీ కూడా ఈ సినిమాకు మ‌రో హైలెట్ గా నిలిచింది. ఉద‌య్ కెరీర్ లోని సూప‌ర్ హిట్ సినిమాల‌లో మ‌న‌సంతా నువ్వే కూడా నిలిచిపోయింది.

mahesh

అయితే ఈ సినిమాను మొద‌ట ద‌ర్శ‌కుడు విఎన్ ఆదిత్య మ‌హేశ్ బాబుతో తెర‌కెక్కించాల‌ని అనుకున్నారు. మ‌హేశ్ బాబు ద‌గ్గ‌ర‌కు వెళ్లి సినిమా క‌థ‌ను కూడా వినిపించారు. కానీ క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో మహేశ్ బాబు ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. దాంతో అదే క‌థ‌ను అప్పుడు వ‌రుస హిట్లతో దూసుకుపోతున్న ఉద‌య్ కిర‌ణ్ కు వినిపించారు. ఉదయ్ ఈ క‌థ న‌చ్చి వెంట‌నే ఓకే చేయడంతో మ‌రో హిట్ ను త‌క ఖాతాలో వేసుకున్నాడు.

Visitors Are Also Reading